Maharastra: కరోనా కేసుల పెరుగుదలకు 'Namaste Trump' ఈవెంటే కారణం.. రౌత్

దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోజువారి కేసులు సైతం వేలకు వేలు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా కేసుల నమోదులో మొదటి స్థానంలో మహారాష్ట్ర కొనసాగుతోంది.

Last Updated : May 31, 2020, 06:03 PM IST
Maharastra: కరోనా కేసుల పెరుగుదలకు 'Namaste Trump' ఈవెంటే కారణం.. రౌత్

ముంబై: దేశవ్యాప్తంగా కరోనా (Covid-19) విజృంభణ రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రోజువారి కేసులు సైతం వేలకు వేలు నమోదవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా కేసుల నమోదులో మొదటి స్థానంలో (Maharastra) మహారాష్ట్ర కొనసాగుతోంది. ఇదే అంశంపై శివసేన సీనియర్ నేత (Sanjay Raut) సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడు (Donald Trump) డొనాల్డ్ ట్రంప్‌ను స్వాగతించడానికి అహ్మదాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమం గుజరాత్‌లో, ముంబై, ఢిల్లీలో కరోనావైరస్ వ్యాప్తికి కారణమని ఆరోపించారు.

Also Read: Chiranjeevi, రామ్ చరణ్, ఉపాసనలపై తేనేటీగల దాడి

మహారాష్ట్ర వికాస్ అఘాది (MVA) ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ప్రతిపక్ష బీజేపీ ప్రయత్నాలు ఫలించకపోవడంతో చతికిలపడిపోయింది. కాగా ఇప్పటికీ ఎటువంటి ముప్పు లేదన్నారు. గుజరాత్ లో కరోనావైరస్ వ్యాప్తి చెందడానికి కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు స్వాగతం పలికేందుకు భారీగా సమావేశమయ్యారు. ట్రంప్ తో పాటు వచ్చిన కొంతమంది ప్రతినిధులు (Delhi) ఢిల్లీ, ముంబైని సందర్శించారు. ఇదే వ్యాప్తికి దారితీసిందని ఆయన మండిపడ్డారు. ఫిబ్రవరి 24న ట్రంప్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, వేలాది మంది హాజరైన అహ్మదాబాద్‌లో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. రోడ్ షో తరువాత, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (GCA) నిర్వహిస్తున్న మోటెరా క్రికెట్ స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రజలను ఉద్దేశించి ఇరువురు నాయకులు ప్రసంగించిన విషయం తెలిసిందే. 

Also Read: రేపటి నుంచి 200 రైల్వే సర్వీసులు..!!

కరోనావైరస్ కేసుల పెరుగుదల అంశానికి  రాష్ట్రపతి పాలనను విధించటానికి ఆధారం అయితే బీజేపీ పాలించిన వాటితో సహా కనీసం 17 రాష్ట్రాల్లో అమలు చేయాలన్నారు. పోరాడటానికి ప్రణాళిక లేనందున కేంద్ర ప్రభుత్వం అనవసరమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మరోవైపు ప్రణాళిక లేకుండా లాక్డౌన్ విధించబడిందని, ప్రస్తుతం ఎత్తివేసే బాధ్యత రాష్ట్రాలకు వదిలివేయబడడం గందరగోళం సృష్టిస్తోందన్నారు. పాలక భాగస్వాములలో అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వానికి ఎటువంటి ముప్పు లేదన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం స్థిరంగా ఉందని, కాంగ్రెస్ కూడా ఎక్కడికీ వెళ్లడం లేదని ఆయన పునరుద్ఘాటించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News