కావేరి జల వివాదంపై తీర్పు నేడే..!

కొన్ని సంవత్సరాల పాటు నలిగిన కావేరీ జలవివాదంపై ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తోంది.

Last Updated : Feb 16, 2018, 11:05 AM IST
కావేరి జల వివాదంపై తీర్పు నేడే..!

కొన్ని సంవత్సరాల పాటు నలిగిన కావేరీ జలవివాదంపై ఈ రోజే సుప్రీంకోర్టు తీర్పును వెలువరిస్తోంది. నీటి కేటాయింపుల కోసం 2007లో తొలిసారిగా కావేరి జలవివాద పరిష్కార ట్రిబ్యూనల్ అందించిన తీర్పును సవాలు చేస్తూ, తమిళనాడు , కర్ణాటకతో పాటు కేరళ ప్రభుత్వం కూడా వేరు వేరుగా సుప్రీంకోర్టులో పిటీషన్లు దాఖలు చేశాయి.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్ర, జస్టిస్‌ ఏఎం ఖాన్‌విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ల కమిటీ ఈ పిటీషన్లపై విచారణ చేపట్టింది. ఈ క్రమంలో 2017 సెప్టెంబరు 20న తీర్పును రిజర్వ్ చేసింది. అయితే అప్పటికే నీటి ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడుకి నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు ఉత్తర్వులను కర్ణాటక పట్టించుకోకపోవడంతో ఆ రాష్ట్రంపై సుప్రీంకోర్టు తన ఆగ్రహాన్ని ప్రకటించింది.

ఈ క్రమంలో తమిళనాడు మరో వివాదంతో ముందుకు వచ్చింది. కేరళ రాష్ట్రంలో కేటాయింపుల కంటే ఎక్కువ జలాన్ని వాడుతుందని ఆరోపిస్తూ.. ఆ సమస్యను కూడా సుప్రీంకోర్టు వద్దకే తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఈ రోజు ఈ అంశంపై తీర్పును వెల్లడిస్తామని సుప్రీం కోర్టు చెప్పడంతో ఈ తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x