పశ్చిమ బెంగాల్ బీజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి

పశ్చిమ బెంగాల్ బీజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి

Last Updated : May 7, 2019, 10:17 PM IST
పశ్చిమ బెంగాల్ బీజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై దాడి

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఆ రాష్ట్ర బీజేపి అధ్యక్షుడు దిలీప్ ఘోష్ కాన్వాయ్‌పై మంగళవారం రాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. అదే కాన్వాయ్‌లో దిలీప్ ఘోష్‌తో కలిసి ప్రయాణిస్తోన్న అస్సాం రాష్ట్ర మంత్రి హిమంత విశ్వ శర్మ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

మమతా బెనర్జి అధికార దుర్వినియోగానికి ఇదో దర్పణం అంటూ ట్వీట్ చేసిన అస్సాం మంత్రి... మనం కలలు కంటున్న నవ భారతం ఇదేనా అని ఆవేదన వ్యక్తంచేశారు.

టీఎంసీ గూండాల దాడిలో బీజేపి కార్యకర్తలు ఎంతో మంది గాయపడ్డారని, తాము ఇక్కడే చిక్కుకుపోయామని హిమంత విశ్వ శర్మ తన ట్వీట్స్‌లో పేర్కొన్నారు. సీఆర్పీఎఫ్ బలగాలు తమను అక్కడి నుంచి తరలించేందుకు సహాయపడ్డారని హిమంత విశ్వ శర్మ తెలిపారు.

Trending News