అమెరికాలో మళ్లీ కాల్పులు.. 9 మంది మృతి, 16 మందికి గాయాలు!

అమెరికాలో మళ్లీ కాల్పులు.. 9 మంది మృతి, 16 మందికి గాయాలు!

Last Updated : Aug 4, 2019, 04:11 PM IST
అమెరికాలో మళ్లీ కాల్పులు.. 9 మంది మృతి, 16 మందికి గాయాలు!

ఓహియో: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. టెక్సాస్‌లోని ఎల్ పసోలో ఉన్న వాల్‌మార్ట్ లో 21 ఏళ్ల దుండగుడు 20 మందిని కాల్చిచంపిన ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే ఓహియోలోని డేటన్‌లో మరో దుండగుడు కాల్పులు జరిపి 9 మందిని పొట్టనపెట్టుకున్నాడు. ఈ ఘటనలో 16 మందికి గాయాలయ్యాయి. అనంతరం దాడికి పాల్పడిన దుండగుడిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. డేటన్‌లో దుండగుడి దాడిని ట్విటర్ ద్వారా వెల్లడించిన పోలీసులు.. పౌరులు అటువైపు వెళ్లకుండా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

దాడి ఘటనపై డేటన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బిఐ) అధికారులు సైతం ఘటనస్థలానికి చేరుకుని దర్యాప్తునకు సహకరిస్తున్నారు.

Trending News