Jani Master Vs Allu Arjun: జానీ అంటే ఆమెకిష్టం.. ఆమె అంటే బన్నికి ఇష్టం. ఆ పాటే చిచ్చు పెట్టింది..

Jani Master Issue Allu Arjun: జానీ మాస్టర్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతుంది. ఇపుడు ఇష్యూ తిరిగి తిరిగి అల్లు అర్జున్ దగ్గరకు  చేరుకుంది.  అయితే దీని వెనక అసలు టార్గెట్ గా అల్లు అర్జున్ అని చెబుతున్నారు సినీ ఇండస్ట్రీ పెద్దలు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 21, 2024, 01:39 PM IST
Jani Master Vs Allu Arjun: జానీ అంటే ఆమెకిష్టం.. ఆమె అంటే బన్నికి ఇష్టం. ఆ పాటే చిచ్చు పెట్టింది..

Jani Master Issue Allu Arjun: సినీ ఇండస్ట్రీలో జానీ మాస్టర్ వ్యవహారంతో  అల్లు అర్జున్ టార్గెట్ అవుతున్నారా.. ? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. అయితే దీని వెనుక అసలు టార్గెట్ అల్లు అర్జున్ గా చేబుతున్నారు కొందరు సినీ ఇండస్ట్రీ పెద్దలు. మొన్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఆ తర్వాత ఇండస్ట్రీలో చిరు ఫ్యామిలీ వర్సెస్ అల్లు అర్జున్ గా మారిపోయింది. రీసెంట్ గా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కూడా కొన్ని వివాదం అయ్యాయి. దీనికి తోడు జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా అల్లు అర్జున్ని టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారంలో అల్లు అర్జున్ ను టార్గెట్ చేయబోతున్నారా అనే చర్చ సినీ ఇండస్ట్రీలో జోరుగా నడుస్తోంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ అంటే ఆమెకు ఇష్టం. ఆమె అంటే బన్ని కి ఇష్టం. ఆ పాటే చిచ్చు పెట్టిందని ప్రముఖ కొరియోగ్రాఫర్ కస్తూరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2024లో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి మద్ధతు తెలిపితే.. అల్లు అర్జున్ కూడా మావయ్య పవన్ కళ్యాణ్ కు మద్దతు ఇస్తున్నట్టు తెలిపారు. కానీ తీరా ఎన్నికలకు ఒక రోజు ముందు తన ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ వైసీపీ తరుపున పోటీకి నిలిచిన శిల్పా రవికి మద్దతు ఇవ్వడంపై పెద్ద దుమారమే రేగింది. కేవలం ఆ క్యాండిడేట్ కు మాత్రమే మద్దతు ఇచ్చినట్టు చెప్పినా..ఇండైరెక్ట్ గా జనసేన ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను రెచ్చగొట్టే విధంగా చేసారనే కామెంట్స్ వినపడ్డాయి. కేవలం తన ఫ్రెండ్ కు సపోర్ట్ చేయాలనుకుంటే .. కేవలం ట్వీట్ చేసి కూడా సపోర్ట్ చేయవచ్చనే వాదనలు జనసేన పార్టీ కార్యకర్తల నుంచి వినబడింది.

 మొత్తంగా ఎన్నికల టైమ్ లో వైపీసీకి అల్లు అర్జున్ నిలిచాడనేది జనసైనికులు వాదన. అప్పట్లో అల్లు అర్జున్ పై నాగబాబు ట్వీట్ తో ఇండస్ట్రీలో పెద్ద రచ్చ నడిచింది. అప్పటి నుంచి అల్లు, కొణిదెల చిరు ఫ్యామిలీ మధ్య గ్యాప్ వచ్చిందనే పుకార్లు షికారు చేసాయి. ఈ విభేదాలు 2008లో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ నుంచి వినిపిస్తున్నాయి. అప్పట్లో అల్లు అరవింద్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్లే ప్రజా రాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోయిందనే వాదనలు కూడా వినిపించాయి. మొత్తంగా ఈ విభేదాలు 2009 నుంచి 15 యేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య రావణ కాష్టంలా రగులుతూనే ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతూనే ఉంది.

ఇదీ చదవండి:  ఎన్టీఆర్ ఇంటిని చూశారా.. బృందావనాన్ని మించిన తారక్ ఇల్లు..!

ఇదీ చదవండి: మహాలయ పక్షంలో ఏ తిథి రోజు శ్రార్ధం పెడితే ఎలాంటి ఫలితాలుంటాయి.. !

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News