పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పీవి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. పీవి సింధుకు

Last Updated : Jan 26, 2020, 07:56 PM IST
పద్మ అవార్డు గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక పద్మ అవార్డు గ్రహీతలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పద్మ భూషణ్ అవార్డుకు ఎంపికైన పీవి సింధు బ్యాడ్మింటన్ క్రీడతో తెలంగాణకే కాకుండా దేశానికి కూడా గొప్ప పేరు తెచ్చిందని ప్రశంసించారు. పీవి సింధుకు అవార్డు రావడం మరింత మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తోందని ప్రశంసించారు.

 పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన కరీంనగర్‌కు చెందిన శ్రీ భాష్యం విజయసారథికి ఫోన్‌లో కేటీఆర్ అభినందనలు తెలిపారు. విజయ సారథి చేసిన సాహిత్య కృషికి దక్కిన గుర్తింపు అని కొనియాడారు. పద్మ శ్రీ అవార్డు దక్కిన హైదరాబాద్‌కు చెందిన చింతల వెంకట్‌రెడ్డికి ఫోన్‌లో అభినందనలు తెలిపారు. ద్రాక్ష పంట సాగులో వినూత్నమైన మెలుకువలతో అద్భుతమైన వ్యవసాయ విధానాలతో గొప్ప దిగుబడులు సాధించిన వ్యక్తి వెంకట్ రెడ్డి అని ప్రశంసించారు. రైతుకు పద్మశ్రీ అవార్డు దక్కడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News