పేలిన పెళ్లి కానుక.. వరుడు దుర్మరణం

ఒడిశాలోని బోలంగిర్ జిల్లాల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది.

Last Updated : Feb 24, 2018, 12:14 PM IST
పేలిన పెళ్లి కానుక.. వరుడు దుర్మరణం

ఒడిశాలోని బోలంగిర్ జిల్లాల్లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఈ నెల 18న సౌమ్య శేఖర్, రీమా అనే జంటకు పెళ్లి జరిగింది. 21న జరిగిన రిసెప్షన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన పెళ్లికానుకలో బాంబును పార్సిల్ చేసి ఉంచారు. కార్యక్రమాలన్నీ పూర్తిచేసుకున్నాక శేఖర్ దంపతులు ఇంటికి చేరుకున్నారు.

తమకు వచ్చిన పెళ్లికానుకల్లో బాంబు ఉంటుందని తెలియని జంట ఒక పార్సిల్ ను తెరిచి చూశారు. అంతలోనే పేలుడు సంభవించి శేఖర్, అతని బామ్మ జీమా, పెళ్లికూతురు రీమా తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శేఖర్, అతని బామ్మ గాయాల తీవ్రత ఎక్కువ ఉండటం కారణంగా మరణించారు. కాగా పెళ్లికూతురు రీమా పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. ఆ పెళ్లికానుకలో బాంబువల్లే పేలుడు సంభవించిందని పోలీసులు గుర్తించారు. రిసెప్షన్‌లో రికార్డయిన వీడియో దృశ్యాల ఆధారంగా ఆ గిఫ్ట్‌ ఎవరు ఇచ్చారన్నది తేల్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు పట్నాఘడ్‌ పోలీస్‌ స్టేషన్‌ అధికారొకరు తెలిపారు.  

Trending News