Hyderabad Blast: హైదరాబాద్‌ శివారులో పేలుడు.. మహిళ మృతి!

Hyderabad Blast: హైదరాబాద్‌ శివారులో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2022, 11:56 AM IST
  • చెత్త సేకరిస్తుండగా పేలుడు
  • హైదరాబాద్ శివారులో ఘటన
Hyderabad Blast: హైదరాబాద్‌ శివారులో పేలుడు..  మహిళ మృతి!

Hyderabad Blast news: హైదరాబాద్‌ శివారులో పేలుడు (Bomb blast in Hyderabad) కలకలం రేపుతోంది. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడలోని ఓ చెత్త కుండీలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళా మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 

పూర్తి వివరాల్లోకి వెళితే..
చెత్తను సేకరించేందుకు  సుశీలమ్మ, ఆమె భర్త ఉదయం ఆటోలో ఆనంద్‌ నగర్‌ పారిశ్రామిక వాడకు వెళ్లారు. అయితే వారు చెత్త సేకరిస్తున్న సమయంలో బాంబు ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడులో సుశీలమ్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఆమె భర్త రంగముని తీవ్ర గాయలపాలయ్యారు. 

పేలుడు జరిగినప్పుడు పెద్ద శబ్దం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుశీలమ్మ మృతదేహం ఘటన స్థలిలో చిందరవందరగా పడి ఉందని స్థానికులు తెలిపారు. వీరు నిత్యం చెత్తను సేకరించి..వాటిని అమ్ముకుని జీవనం సాగిస్తారు. అందుకే వీరు పారిశ్రామికవాడలోని వ్యర్థాలను సేకరించేందుకు ఆటోలో వచ్చారు. సమాచారం అందుకున్న శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని...పేలుడుకు గల కారణాలపై ఆరా తీశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

Also Read: Petrol Price Hiked: బాప్‌రే.. లీటర్ పెట్రోల్ ధర @ రూ. 204.. ఎక్కడో తెలుసా..??

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News