కోహ్లి.. రూ.34 కోట్ల ఫ్లాట్‌ను కొనట్లేదు!

విరాట్ కోహ్లి మనసు మార్చుకున్నాడు.

Last Updated : Mar 24, 2018, 01:07 PM IST
కోహ్లి.. రూ.34 కోట్ల ఫ్లాట్‌ను కొనట్లేదు!

ముంబై నగరంలో వోర్లీలో రూ.34 కోట్లతో ఫ్లాట్‌ను కొనేందుకు భారతజట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి దాదాపు రెండేళ్ల క్రితమే ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోహ్లి మనసు మార్చుకున్నాడు. ఆ ఇల్లును కొనేందుకు చేసుకున్న ఒప్పందాన్ని విరమించుకున్నాడు.

ముంబైలో వోర్లి ఏరియాలో అత్యంత ఖరీదైన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయాలని 2016 జూన్‌ నెలలో నిర్ణయించుకున్నాడు కోహ్లి. ఈ మేరకు టీవర్-సీలో 35వ అంతస్థులో 7000 చదురపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఫ్లాట్‌ను రూ.34 కోట్లకు కొనేందుకు  ఓంకార్ డెవలపర్స్ నిర్మాణ సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నాడు. అత్యాధునిక హంగులతో కూడిన నిర్మాణం, జాగింగ్‌, వాకింగ్‌ చేసుకునేందుకు కారిడార్స్‌  ఉన్న ఫ్లాట్‌ కోసం కోటిన్నర డిపాజిట్‌ చేయగా, మరో కోటితో అగ్రిమెంట్‌ కూడా చేసుకున్నాడు. కానీ ఇప్పుడా ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు.

గతేడాది డిసెంబర్‌లో బాలీవుడ్‌ నటి అనుష్క శర్మను వివాహం చేసుకున్న విరాట్ కోహ్లి.. ఇటీవలే ముంబై వోర్లీ ప్రాంతంలో సముద్ర-వ్యూ కలిగిన అపార్టుమెంట్‌లో రూ.15 లక్షల నెలసరి బాడుగకు ఫ్లాట్ తీసుకోవడం తెలిసిందే.

Trending News