Shukra Nakshatra Gochar 2024: శుక్రుడి నక్షత్ర సంచారం..ఈ 3 రాశులవారికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ విపరీతంగా పెరుగబోతోంది!

Shukra Nakshatra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం కారణంగా 12 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా ఈ సమయంలో మెరుగుపడుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2024, 03:13 PM IST
 Shukra Nakshatra Gochar 2024: శుక్రుడి నక్షత్ర సంచారం..ఈ 3 రాశులవారికి బ్యాంక్‌ బ్యాలెన్స్‌ విపరీతంగా పెరుగబోతోంది!

 

Shukra Nakshatra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశి సంచారం చేస్తుంది. ఇలా సూర్య, శుక్ర గ్రహాలు సంచారం చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైన శుభ యోగాలతో పాటు సానుకూల ప్రభావం ఏర్పడుతుంది. దీని కారణంగా రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో కీలక మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే శుక్రుడు రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. జనవరి 29న ఈ గ్రహం పూర్వాషాడ నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. ఈ సంచార ప్రక్రియ 29న సాయంత్రం 5:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ నక్షత్రానికి అధిపతి శుక్రుడు వ్యవహరిస్తాడు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొన్ని రాశులవారికి ప్రేమ, గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ నక్షత్ర సంచారం ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

శుక్రుడి నక్షత్ర సంచారం కారణంగా ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం:
మేష రాశి:

మేషరాశికి శుక్రుడి నక్షత్ర సంచారం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఈ రాశి వారు ఊహించని విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా పెద్దపెద్ద కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా అన్ని పనుల్లో అంకితభాతంతో ఎంతో కృషితో పని చేస్తారు. దీని కారణంగా హోదా, ప్రతిష్టలు, డబ్బు పెరిగే అవకాశాల కూడా ఉన్నాయి. అంతేకాకుండా ప్రేమ, వైవాహిక జీవితాల్లో కూడా మార్పులు వస్తాయి. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

మిథున రాశి:
పూర్వాషాఢ నక్షత్రంలో శుక్రుడు సంచారం చేయడం వల్ల మిథునరాశి వారి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఊహించని ప్రయోజనాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు మిథున రాశివారికి ఆదాయం కూడా పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. సంపదనలో కూడా మార్పులు వస్తాయి. 

ధనుస్సు రాశి:
శుక్రుడు సొంత నక్షత్రం పూర్వాషాఢంలో సంచారం కారణంగా ధనస్సు రాశివారికి ఎంతో మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఎలాంటి రంగాల్లో పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు. దీంతో పాటు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. 

Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్‌, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News