ఆసియా కప్ 2018 ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: సోషల్ మీడియాలో సానియా మీర్జా సందేశం

ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: సానియా మీర్జా మెస్సేజ్ ట్వీట్

Last Updated : Sep 20, 2018, 10:20 AM IST
ఆసియా కప్ 2018 ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్: సోషల్ మీడియాలో సానియా మీర్జా సందేశం

ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా నేడు ఇండియా vs పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. యావత్ ప్రపంచ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఇదొక అద్భుతమైన మ్యాచ్. భారత్, పాక్ మైదానంలో తలపడుతున్నాయంటే, అది ఏ ఆట అయినా, ఆ ఆటపై ఉండే అంచనాలే వేరు. క్రికెట్ విషయంలో ఆ అంచనాలు ఇంకా రెట్టింపవుతాయి. కేవలం భారత్, పాక్ క్రికెట్ అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేసే ఈ మ్యాచ్‌లో అద్భుతమైన పర్‌ఫార్మెన్స్ కనబర్చిన ఆటగాళ్లను అభిమానులు నెత్తిన పెట్టుకుని పూజిస్తారు. అదే ఆట ఏ మాత్రం అటు ఇటైనా... అదే ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తారు. ఆ ఆటగాళ్ల ఇళ్లపై రాళ్లు రువ్విన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇక సోషల్ మీడియాలోనైతే ఈ వీరాభిమానం వెర్రితలలు వేయడం తరచుగా చూస్తున్నదే. అందుకే ఇవాళ ఇండియా-పాక్ క్రికెట్ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ సానియా మీర్జా సోషల్ మీడియా యూజర్స్‌కి ఓ సందేశం ఇచ్చింది. 

ఈ మ్యాచ్‌ని కేవలం క్రికెట్ మ్యాచ్‌గానే పరిగణించి క్రీడా స్పూర్తి ప్రదర్శించాలే తప్ప అంతకుమించి రియాక్ట్ అవకూడదనే సందేశాన్ని ఇస్తూ సానియా మీర్జా ఓ ట్వీట్ చేసింది. అయినా సరే సోషల్ మీడియాలో ఎవరికి తోచిన విధంగా వాళ్లు రియాక్ట్ అవుతారు కనుక గర్భవతి అయిన తాను కొద్దిరోజులపాటు ఈ సోషల్ మీడియా నుంచి తప్పుకోవడమే మంచిది అని సానియా మీర్జా తన ట్వీట్‌లో పేర్కొంది. అన్నట్టు సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్ ప్రస్తుతం ఇండియాతో తలపడనున్న పాక్ జట్టులో సభ్యుడనే సంగతి తెలిసిందే.
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x