IND vs SL: చెలరేగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. లంకపై భారత్ ఘన విజయం

IND vs SL: చెలరేగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. లంకపై భారత్ గెలుపు

Last Updated : Jul 6, 2019, 11:15 PM IST
IND vs SL: చెలరేగిన రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్.. లంకపై భారత్ ఘన విజయం

లీడ్స్: నేడు భారత్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. అనంతరం శ్రీలంక నిర్దేశించిన 265 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 43.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 

భారత ఆటగాళ్లలో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 118 బంతుల్లో 111 పరుగులు (11x4,1x6), రోహిత్ శర్మ 94 బంతుల్లో 103 పరుగులు (14x4, 2x6), విరాట్ కోహ్లీ 41 బంతుల్లో 34 పరుగులతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలర్లలో జస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు తీసి అదరగొట్టాడు. సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు.

Trending News