ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా వ్యవహరించిన డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ( Nimmagadda Ramesh Kumar ) విషయంలో నిమ్మగడ్డ లాజిక్ మిస్ అయినట్టే కన్పిస్తోంది. ఇదే విషయాన్ని ఏపీ అడ్వకేట్ జనరల్ సుబ్రహ్మణ్య శ్రీరామ్ ( AP AG Subrahmanya Sriram ) స్పష్టం చేశారు.
ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ( Nimmagadda Ramesh Kumar ) తొలగిస్తూ జారీ అయిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High court ) ఇచ్చిన తీర్పు రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఏపీ సర్కార్కి ఇదో పెద్ద దెబ్బగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం ఈ అంశంపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే అంశంపై బీజేపీ ఎంపీ, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహా రావు ( BJP MP GVL Narasimha Rao ) స్పందించారు.
ఏపీ హై కోర్టు ( AP High court ) రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ని ( AP SEC Nimmagadda Ramesh Kumar ) ఆ స్థానం నుంచి తొలగించడంపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆయన్ని తిరిగి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మీడియాకు ఇటీవల కాలంలో ఎటువంటి నియంత్రణ లేకుండాపోయిందని ఏపీ డీజీపి గౌతం సవాంగ్ ( AP DGP Gautam Sawang ) అసహనం వ్యక్తంచేశారు. ఎలక్ట్రానిక్ మీడియా ( Electronic media ), ప్రింట్ మీడియా ( Print media ), సోషల్ మీడియాలో ( Social media ) ఎటువంటి నియంత్రణ లేకుండా ఏదో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ప్రచురిస్తున్న వార్తలు, వ్యాఖ్యల వల్ల సమాజంలో హింస చెలరేగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
వివేకా హత్య కేసును సీబీఐకు అప్పగించాలంటూ వివేకానంద కూతురు సునీత, భార్య సౌభాగ్యమ్మ, జగన్, టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లపై విచారణ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలకు షెడ్యూల్ ప్రక్రియ విడుదల చేయడానికి రెండు రోజులు మాత్రమే ఉన్న తరుణంలో, సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలకు స్టే విధించడం ద్వారా ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 50 శాతానికి మించి
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనవరి 17వ తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయాలని హైకోర్టు సూచించింది. మొత్తం రెండు దశలలో ఎన్నికలు నిర్వహించాలని సూచించింది.
కొత్త ఏడాదికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త కొత్త హైకోర్టు కొలువుదీరింది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు న్యాయమూర్తుల చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు హజరయ్యారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.