AP Govt: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు.

Last Updated : Aug 17, 2020, 12:49 PM IST
  • సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురు
  • హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందన్న సీజేఐ బాబ్డే
  • తుది విచారణ పూర్తయ్యేవరకు ఏపీ హైకోర్టు నిర్ణయమే ఫైనల్
AP Govt: సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి (AP Govt) చుక్కెదురైంది. అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్ 5 జోన్ విషయంలో ఏపీ హైకోర్టు (AP High Court) ఉత్తర్వులను సుప్రీంకోర్టు సమర్థించింది. అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టులో విచారణ సరిగానే జరిగిందని, ఇందులో ఏ అభ్యంతరాలు కనిపించడం లేదని సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అభిప్రాయపడ్డారు. VVS Laxman: ‘రిటైర్మెంట్‌పై ధోనీ 2006లోనే షాకిచ్చాడు’

ఇళ్ల స్థలాల పంపిణీ ఆర్ 5 జోన్ కేసు తుది విచారణ చేపట్టి, ముగించాలని ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. ఏపీ రాజధాని aమాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేయడం తెలిసిందే. దీనిపై తుది విచారణ పూర్తయ్యేవరకు ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయకూడదంటూ రాష్ట్ర హైకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చింది. టాలీవుడ్ నటుడు రాజా చెంబోలు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు 
AP Inter Re-verification Results: ఏపీ ఇంటర్‌ రీ-వెరిఫికేషన్‌ ఫలితాలు విడుదల

Trending News