Tata Altroz CNG AMT launched: దేశీయ కార్ల తయారీదారు సంస్థ అయిన టాటా మోటార్స్ పాసింజర్ వెహికల్ 5 స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ తో కూడిన ఆల్ట్రోజ్ సీఎన్జీ వేరియంట్ ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. టాటా మోటార్స్ దేశంలో ఇప్పటికే పలు విభాగాల్లో వాహనాలను విక్రయిస్తోంది. ఈ కారు ఇప్పుడు AMT ట్రాన్స్ మిషన్ తో లాంచ్ చేసింది. ఈ కారు ధర, ఫీచర్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Today Top Business Headlines: నేడు మే 6వ తేదీ భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రోజు అని చెప్పాలి. సన్ ఫార్మా 12 బిలియన్ల భారీ అంతర్జాతీయ ఒప్పందంతోపాటు ప్రభుత్వం ఆరు రంగాల్లో ఎఫ్ డీఐలను ఆమోదించడం.. రూ. 3,936కోట్ల సెమీ కండక్టర్ ప్రాజెక్టులతోపాటు అమెరికాలో భారత కంపెనీలు 1.1 బిలియన్ల పెట్టుబడులు దేశ వ్రుద్ధికి, ఉద్యోగ కల్పనకు ప్రపంచస్థాయిలో భారత పట్టుకు కొత్త ఊతాన్ని అందిస్తున్నాయి. సన్ ఫార్మా భారీ ఒప్పందం, అమెరికాలో భారత పెట్టుబడులు.. ఎఫ్డీఐలు వేగవంతం.. ఇలాంటి నేటి టాప్ బిజినెస్ హెడ్లైన్స్ చూద్దాం.
Gold Rate: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు మూడు నెలలుగా కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఇప్పుడు ఒక్కసారిగా భారీగా పెరిగిపోతున్నాయి. తులం 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,55 వేల రూపాయలు పలుకుతుంది. అయితే బంగారం కొనాలనుకునే వారికి మాత్రం రానున్న కాలంలో బంగారం ధరలు మరింత తగ్గుతాయన్న ఆశలు ఉన్నా.. వారి ఆశలపై యాక్సిస్ డైరెక్ట్ పిడుగు పడే వార్త చెప్పింది.
Gold Rate Prediction Next 3 Months: భారతీయులకు బంగారం అంటే ఒక ఆభరణం మాత్రమే కాదు.. తరతరాల నుంచి వస్తున్న ఒక సెంటిమెంట్. ఏ చిన్న శుభకార్యమైనా సరే బంగారం కొనాల్సిందే. తులాల కొద్దీ కొనుగోలు చేయకున్నా కనీసం ఒక గ్రాము బంగారమైనా కొంటుంటారు. ముఖ్యంగా అక్షయ త్రుతీయ, దసరా పండగలకు చాలా మంది బంగారం కొంటుంటారు. ఆ రోజుల్లో బంగారం కొంటే ఏడదంతా సంపద పెరుగుతుందని..లక్ష్మీదేవి తమ ఇంట్లో కొలువై ఉంటుందని నమ్ముతుంటారు.
Gold Silver Price Crash: గత కొంతకాలంగా ఆకాశాన్ని తాకుతున్న బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. జనవరిలో సరికొత్త రికార్డులను సృష్టించిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా దిగివస్తున్నాయి. కేవలం మూడు నెలల వ్యవధిలోనే తులం బంగారంపై ఏకంగా రూ. 41,000 మేర ధర తగ్గడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది.
Rupee Big Fall: భారత రూపాయి తీవ్ర ఒడిదుడుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. కొన్ని రోజులుగా పుంజుకున్నా.. మళ్లీ డాలర్ ధాటికి ఘోర పతనాన్ని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్తతలు భారత రూపాయిపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం ఉదయం ట్రేడింగ్ లోనే రూపాయి విలువ భారీగా పతనం అయ్యింది. ఈ పరిణామాల వెనకున్న అసలు కారణాలు.. ప్రభావాలను తెలుసుకుందాం.
EPF Unclaimed Deposit: దేశంలో ప్రస్తుతం 31.87లక్షలకు పైగానే ఈపీఎఫ్ అకౌంట్లు డియాక్టివేట్ అయి ఉన్నాయి. వీటిలో సుమారు రూ. 10,915కోట్ల వరకు డిపాజిట్లు ఉన్నాయి. దీన్ని పరిష్కరించేందుకు ఆటో రీఫండ్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభించింది ఈపీఎఫ్ఓ.
Gold Shopping: బంగారం ధర భగ్గుమంటుంది. ఈ సమయంలో బంగారం కొనాలంటేనే.. ఆలోచించాల్సి వస్తుంది. తులం పసిడి ధర రూ. 80వేలు ఉన్న సమయంలో ఏడు వారాల నగలను అసలు బంగారంతో చేయించుకుంటే కనీసం 30 నుంచి 40లక్షల ఖర్చు అయ్యేది. అయితే ఇది సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారంగానే ఉండేది. చాలా మందికి పెళ్లిళ్లలో ఏడు వారాల నగలు ధరించాలన్న కోరిక ఉన్నా.. దాన్ని తీర్చుకోలేక వదలుకోవల్సి వచ్చేది.
Indian Households Gold: భారతీయ మహిళలకు బంగారానికి మధ్య ఉన్న సంబంధం గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. బంగారాన్ని భారతీయులు ఒక ఆభరణంగా మాత్రమే కాదు.. దానిని ఒక సెంటిమెంట్ గా భావిస్తుంటారు. ఆపద వచ్చినా..ఆర్థిక కష్టం వచ్చినా..మరే ఇతర సమస్య వచ్చినా..ముందుగా వారికి బంగారమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి లేదా అమ్మి తమ అత్యవసర పరిస్థితులను గట్టెక్కే ప్రయత్నం చేస్తుంటారు. అందుకే చాలా మంది మహిళలు.. చేతిలో ఏమాత్రం డబ్బు ఉన్నా సరే బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.
Silver Price Crash: గత కొన్ని రోజులుగా చుక్కలను తాకిన వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. బులియన్ మార్కెట్లో వెండి ధర ఏకంగా కుప్పకూలిపోయింది. పెళ్లిళ్ల సీజన్ ముంగిట, వెండి నగలు లేదా వస్తువులు కొనాలనుకునే వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. ఒక్క రోజులోనే వెండి ధరలో భారీ పతనం నమోదు కావడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
KCR unknown facts: నిశ్శబ్దంగా ఉండే ఆ ఫాంహౌస్ లైబ్రరీలో 70 వేల పుస్తకాలు కొలువై ఉన్నాయి. కానీ.. అర్ధరాత్రి వేళ కేసీఆర్ చేతిలో మెరిసే ఆ ఒక్క పుస్తకం వెనుక ఒక రాజకీయ భూకంపం దాగి ఉంది. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేసే మారణాయుధం అన్నా.. శత్రువుల బలహీనతను పట్టే దిక్సూచి అన్నా ఆ గ్రంథమే. 500 ఏళ్ల నాటి ఆ రహస్య సూత్రాలతోనే ఆయన గల్ఫ్ వెళ్లాల్సిన సామాన్యుడి నుంచి గద్దెనెక్కిన మొనగాడి వరకు ఎదిగారు. అసలు ఆ పుస్తకంలో ఉన్న గుట్టు ఏంటి? కేసీఆర్ వేసే ప్రతి అడుగు వెనుక ఉన్న ఆ మాకియవెల్లి రహస్యం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
NPS Vatsalya Scheme: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం ద్వారా 18 ఏళ్ల లోపు పిల్లల పేరు మీద పెన్షన్ ఖాతా తెరవవచ్చు. ఏడాదికి కనీసం రూ. 250 పెట్టుబడితో ప్రారంభించి, ఈక్విటీల ద్వారా దీర్ఘకాలంలో భారీ నిధిని పొందవచ్చు. ఉన్నత చదువుల కోసం పాక్షిక విత్డ్రా సౌకర్యం కూడా ఉంది. ఆన్లైన్లో eNPS ద్వారా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Cheapest Home Loan: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. అయితే ఆ కల నెరవేర్చుకోవడానికి తీసుకునే హోమ్ లోన్ విషయంలో వడ్డీ రేట్లు చాలా ముఖ్యం. ఏప్రిల్ 8న ఆర్బీఐ తన రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ సారి కూడా వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ప్రస్తుతం మార్కెట్లో చౌకైన గృహ రుణాలు అందిస్తున్న టాప్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం.
Post Office300 per month RD Scheme: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తు కోసం ఒక పెద్ద నిధిని నిర్మించుకోవాలని కలలు కంటారు. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం అందరికీ సాధ్యం కాదు. అటువంటి వారి కోసం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన మార్గంగా నిలుస్తోంది. చిన్నా చితకా వ్యాపారులు, ఉద్యోగులు ఎవరైనా సరే.. రోజుకు కేవలం రూ. 300 ఆదా చేస్తూ లక్షాధికారి అయ్యే అవకాశం ఇక్కడ ఉంది. అవును రోజుకు రూ. 300 ఆదా చేస్తే 15లక్షలు మీ చేతికి అందుతాయి ఎలాగో తెలుసుకుందాం.
Stock Market Today: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడంతో ఏప్రిల్ 9వ తేదీన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు ప్రారంభం నుంచే భారీ లాభాలను నమోదు చేశాయి. ముడి చమురు ధరలు తగ్గడం.. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయి. ఐటీ, బ్యాంకింగ్ షేర్లు మార్కెట్ను పెంచుతున్నాయి.
New Gold Hallmarking Rules: బంగారం కొనేటప్పుడు మోసపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం హాల్మార్కింగ్ను 380 జిల్లాల్లో తప్పనిసరి చేసింది. నగలు కొనే ముందు BIS లోగో, క్యారెట్ స్వచ్ఛత, ఆరు అంకెల HUID కోడ్, టెస్టింగ్ సెంటర్ మార్క్ అనే 4 గుర్తులను తప్పనిసరిగా చెక్ చేయాలి. BIS CARE యాప్ ద్వారా ఈ వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.
Pakistan Petrol Price Cut: ఆర్థికంగా తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలతో బెంబేలెత్తుతున్న ప్రజలకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ ఊరటనిచ్చారు. లీటరు పెట్రోల్ ధరపై ఏకంగా రూ. 80 మేర సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కేవలం ఒక రోజు ముందే ధరలు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన నేపథ్యంలో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది.
Dunkin’ Donuts: అమెరికాకు చెందిన ప్రముఖ కాఫీ అండ్ డోనట్స్ సంస్థ డంకిన్ డోనట్స్.. భారత మార్కెట్ నుండి నిష్క్రమించాలని నిర్ణయించుకుంది. నిజానికి ఈ సంస్థ భారతదేశంలో నేరుగా వ్యాపారం చేయడం లేదు. మన దేశంలో దీని కార్యకలాపాలను జుబిలెంట్ ఫుడ్ వర్క్స్ లిమిటెడ్ అనే సంస్థ ఫ్రాంచైజీ ఒప్పందం ద్వారా నిర్వహిస్తోంది. అయితే.. తాజాగా ఈ రెండు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ముగింపు దశకు చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.
iPhone 15 Discount Offer: ఐఫోన్ లవర్స్ కు బంపర్ ఆఫర్. ప్రస్తుతం ఆపిల్ ఐఫోన్ 15 పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ను క్రోమా సేల్లో రూ. 40,000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఎలాగో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Ola Electric Roadster: ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్లో ఓలా ఎలక్ట్రిక్ సంచలనం సృష్టించింది. తన ప్రీమియం మోడల్ రోడ్స్టర్ ఎక్స్ ప్లస్ ధరను ఏకంగా 60,000 రూపాయలు తగ్గించి మార్కెట్ను ఆశ్చర్యపరిచింది. గతంలో రూ. 1,89,999 గా ఉన్న ఈ బైక్ ధర, తాజా తగ్గింపుతో కేవలం రూ. 1,29,999 కే అందుబాటులోకి వచ్చింది. ఇంతటి హై-పెర్ఫార్మెన్స్ బైక్పై ఈ స్థాయి డిస్కౌంట్ ఇవ్వడం ఇదే మొదటిసారి.
Mahindra Price Hike: సొంతంగా కారు కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా? అందులోనూ మహీంద్రా ఎస్యూవీలపై మీరు కన్నేశారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మహీంద్రా అండ్ మహీంద్రా తమ నాన్-ఎలక్ట్రిక్ ఎస్యూవీలు, కమర్షియల్ వాహనాల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ధరలు ఏప్రిల్ 6, 2026 నుండి అమల్లోకి రానున్నాయి. టాటా మోటార్స్, బిఎమ్డబ్ల్యూ, ఆడి వంటి దిగ్గజ కంపెనీల బాటలోనే మహీంద్రా కూడా పయనిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
silver price crash: బులియన్ మార్కెట్లో వెండి ధరలు ఒక్కసారిగా నేలచూపులు చూస్తున్నాయి. గురువారం ఉదయం ఇరాన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన సమాచారం వెండి ఇన్వెస్టర్లకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. అమెరికా సాధించాలనుకున్న లక్ష్యాలు దాదాపు నెరవేరాయని.. రాబోయే రెండు మూడు వారాల్లో కీలక చర్యలు తీసుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించడంతో మార్కెట్లో అనిశ్చితి రాజ్యమేలింది. ఈ ప్రభావంతో మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పకూలాయి.