AP Elections NDA Plan: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికలపై ఎన్డీయే కూటమి సమావేశమైంది. ఉండవల్లిలోని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో శక్రవారం జరిగిన సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొని ఎన్నికలపై చర్చించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార తీరు, అభ్యర్థుల గెలుపు కోసం చేయాల్సిన ప్రణాళికలపై చర్చించినట్లు సమావేశం. గెలుపు కోసం ఉమ్మడిగా కలిసి వెళ్దామని.. తప్పక విజయం సాధిస్తామని ఈ సమావేశంలో నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
Chandrababu Naidu Case: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అవినీతికి పాల్పడిన దాఖలాలు లేకుండా 2018 లోలే ఆ ఫైల్స్ అన్నీ మాయం చేశారని.. కానీ ఆర్థిక శాఖలో షాడో ఫైల్స్ అంటూ కొన్ని ఉంటాయనే విషయం మర్చిపోయారని రోజా వ్యాఖ్యానించారు.
మహారాష్ట్ర మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ రావు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. పార్టీ అధ్యక్షుడితో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విద్యాసాగర్ రావు.. పలు ఆసక్తికరమైన అంశాలను మీడియాతో పంచుకున్నారు.
దక్షిణాదిన కర్ణాటకలో తప్ప ఇంకే ఇతర రాష్ట్రంలోనూ పాగా వేయలేకపోతున్న బీజేపి... రానున్న కాలంలోనైనా అక్కడ బలమైన శక్తిగా ఎదగాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు బీజేపి అధ్యక్షుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో.. కొత్తగా నియమించబోయే అధ్యక్షుల ఎంపికకు సైతం పార్టీ అధిష్టానం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.