ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు..ఆ నలుగురు ఎవరంటే..!

ED on Casino: క్యాసినో వ్యవహారంలో విచారణను ఈడీ అధికారులు వేగవంతం చేశారు. ఇప్పటికే నాలుగురోజులపాటు చికోటి ప్రవీణ్‌ను విచారించిన అధికారులు..పలువురు ప్రముఖులకు నోటీసులు జారీ చేశారు. 

Written by - Alla Swamy | Last Updated : Aug 5, 2022, 08:32 PM IST
  • క్యాసినో వ్యవహారం
  • ఈడీ అధికారుల విచారణ
  • పలువురికి నోటీసులు
ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఎమ్మెల్యేలకు నోటీసులు..ఆ నలుగురు ఎవరంటే..!

ED on Casino: క్యాసినో వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఈకేసులో కీలకంగా ఉన్న నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. ఇందులో ఏపీ, తెలంగాణ అధికార పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నట్లు తెలుస్తోంది. క్యాసినో వ్యవహారంలో హవాలా జరిగిందని ఈడీ గుర్తించింది. హవాలా లావాదేవీలపై లోతుగా ఆరా తీస్తున్నారు. నేపాల్‌లో జరిగిన క్యాసినోలో ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు విచారణలో తేలింది. ఈనేపథ్యంలో పలువురికి నోటీసులు జారీ చేశారు.

ఇప్పటికే నాలుగు రోజులపాటు చికోటి ప్రవీణ్‌ను ఈడీ అధికారులు విచారించారు. ప్రవీణ్‌తోపాటు అతడి అనుచరులను ప్రశ్నించారు. మనీలాండరింగ్‌, విదేశీ టూర్‌లపై పలు ప్రశ్నలు సంధించారు. విదేశాల్లో క్యాసినో ఆడించినట్లు గుర్తించారు. ఇందులో పలువురు ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో మరికొంతమందికి నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇందుకు రంగం సిద్ధమవుతోంది. చికోటి ప్రవీణ్‌ దగ్గర నుంచి కీలక విషయాలను రాబట్టినట్లు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

నేపాల్‌లో క్యాసినో జరిగినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో మనీలాండరింగ్ జరగడంతో రంగంలోకి దిగింది. ఇందుకు హైదరాబాద్‌ నుంచే అంతా జరిగినట్లు తేల్చారు. దీంతో భాగ్యనగరంలో ఈడీ అధికారులు మోహరించారు. చికోటి ప్రవీణ్ అతడి అనుచరుల ఇళ్లల్లో ఏకకాలంలో సోదాలు చేశారు. పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చికోటి ప్రవీణ్‌తోపాటు పలువురిని విచారణకు పిలిచారు. నాలుగు రోజులపాటు వీరిని విచారించారు.

హవాలా చెల్లింపులపై కూపీ లాగారు. ఇందులో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ కావడంతో మిగతా వారిలో టెన్షన్‌ నెలకొంది. ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈవ్యవహారంలో ఏపీ, తెలంగాణకు చెందిన రాజకీయ ప్రముఖులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నేపాల్ టూ హైదరాబాద్‌ మధ్య ఏం జరిగిందన్న పూర్తి సమాచారాన్ని ఈడీ సేకరించింది.

Also read:Cooking Oil: సామాన్యులకు అందుబాటులోకి వంట నూనెల ధరలు..త్వరలో మరో కీలక నిర్ణయం..!

Also read:Free Entry: హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్..ఇకపై చార్మినార్, గోల్కొండ కోటలో ఫ్రీ ఎంట్రీ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x