Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వీరు వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందినవారని తెలుస్తోంది. (Warangal Rural Road Accident)

Last Updated : Sep 2, 2020, 08:20 AM IST
Road Accident: వరంగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అయిదుగురి దుర్మరణం

వరంగల్ రూరల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Warangal Rural Road Accident) చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. బుధవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో వాహనాన్ని నడుపుతూ దామెర మండలం పసరగొండ క్రాస్‌ రోడ్‌ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. Gold Price In Hyderabad: మళ్లీ పెరిగిన బంగారం ధరలు, షాకిచ్చిన వెండి

ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువకుడు మృతిచెందారు. సమాచారం అందుకున్న పరకాల ఏసీపీ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. మృతులను మేకల ప్రవీణ్‌, మేకల రాజేష్‌, మేడి పవన్‌, రోహిత్‌, రహీంలుగా గుర్తించారు. వీరు వరంగల్ పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందినవారు. వీరి వయసు దాదాపు పాతిక సంవత్సరాలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇసుక లారీ డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  Photo Gallery: ప్రియుడితో కలిసి నయనతార ఓనమ్ సెలబ్రేషన్స్ 
 
Photos: ఘనంగా గౌతమ్ పుట్టినరోజు వేడుక 
Khatron Ke Khiladi టైటిల్ విన్నర్, నటి నియా శర్మ ఫొటో గ్యాలరీ

Trending News