మాజీ స్పీకర్ రామచంద్రరెడ్డి కన్నుమూత

Last Updated : Apr 29, 2018, 11:35 AM IST
మాజీ స్పీకర్ రామచంద్రరెడ్డి కన్నుమూత

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.రామచంద్రారెడ్డి హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కన్నుమూశారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. రామచంద్రారెడ్డి స్వస్థలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ మండలం మారేపల్లి గ్రామం.  ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించిన సీఎం కేసీఆర్.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రామచంద్రారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సీఎం కేసీఆర్‌.. పంచాయతీరాజ్‌ వ్యవస్థ బలోపేతానికి కృషి చేసిన తొలితరం నాయకుడు రామచంద్రారెడ్డి అని పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ సీఎస్‌కు ఆదేశించారు. అటు ఆయన అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు జూబ్లీ హిల్స్ విస్పర్ వ్యాలీ సమీపంలోని స్మశాన వాటికలో జరగనున్నాయి.

Trending News