Q NEWS ఆఫీసుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరుల దాడి

Jagadeeshwar Reddy aide attack on Q News: రాష్ట్ర విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఇవాళ సాయంత్రం తీన్మార్ మల్లన్న ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న క్యూన్యూస్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు కార్యాలయంలో పనిచేస్తోన్న సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారు.

Written by - Pavan | Last Updated : Oct 29, 2022, 05:27 AM IST
Q NEWS ఆఫీసుపై మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరుల దాడి

Jagadeeshwar Reddy aide attack on Q News: మంత్రి జగదీశ్ రెడ్డి అనుచరులు రెచ్చిపోయారు. తీన్మార్ మల్లన్న నిర్వహిస్తున్న క్యూ న్యూస్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారు. సిబ్బందిని అసభ్యపదజాలంతో దూషిస్తూ భయబ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశారు.  నిన్న ఉదయం తీన్మార్ మల్లన్న మార్నింగ్ న్యూస్ చదివే సమయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డపై దురుసుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు ఈ దాడికి పాల్పడ్డారు. తాము వారిస్తున్నప్పటికీ వినిపించుకోకుండా బెదిరింపులకు పాల్పడుతూ దాడికి పాల్పడ్డారని క్యూ న్యూస్ ఆఫీస్ సిబ్బంది వాపోయారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News