ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌కు ప్రాధాన్యత

హైదరాబాద్ మెట్రో ప్రారంభోత్సవం సమయంలో తెలంగాణ పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ కు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

Last Updated : Nov 28, 2017, 06:27 PM IST
ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్‌కు ప్రాధాన్యత

హైదరాబాద్: మెట్రో ప్రారంభోత్సవం సమయంలో తెలంగాణ పట్టణాభివృద్ధి మంత్రి కేటీఆర్ కు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. రిబ్బన్ కటింగ్ సమయంలో కాస్త దూరంలో నిలబడ్డ కేటీఆర్ ను పిలిచి తన పక్కనే ఉంచుకున్నారు మోడీ. అలాగే మెట్రో రైలు ప్రయాణంలోనూ కేటీఆర్ ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. మెట్రో ప్రయాణ సమయంలో మోడీ పక్కన ఒక వైపు గవర్నర్ నరసింహన్ ఉండగా..మరోవైపు మంత్రి కేటీఆర్ ఉన్నారు.  ప్రయాణ సమయంలో  కేటీఆర్ తో మాట్లాడుతూ ప్రధాని మోడీ ఉల్లాసంగా కనిపించారు. మెట్రో ప్రారంభించని అనంతరం  మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు వెళ్లి... మళ్లీ అక్కడ నుంచి మియాపూర్ కు ప్రధాని మోడీ, కేటీఆర్ లు ప్రయాణించారు. మెట్రో పనులు మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో జరిగిన విషయం తెలిసిందే. అలాగే అనుమతుల విషయంలోనూ మంత్రి కేటీఆర్ చురుగ్గా వ్యవహరించారు. ఈ విషయంలో కేంద్ర సహకారం కోసం మంత్రి కేటీఆర్ పలుమార్లు మోడీని కలిశారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ మెట్రో ప్రారంభోత్సవ సమయంలో కేటీఆర్ కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది.

 

Trending News