Pawan Kalyan: జనసేనానీ మెట్రో ప్రయాణం..

నసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య వ్యక్తిలా ఆయన హైదరాబాద్ (Hyderabad Metro) మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు.

Last Updated : Nov 5, 2020, 11:50 AM IST
Pawan Kalyan: జనసేనానీ మెట్రో ప్రయాణం..

Pawan Kalyan Traveling in Hyderabad Metro: హైదరాబాద్‌: జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) గురువారం మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య వ్యక్తిలా ఆయన హైదరాబాద్ (Hyderabad Metro) మాదాపూర్ స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్‌సాబ్‌ (Vakeel saab)  సినిమా షూటింగ్‌  ( Vakeel saab movie shooting ) నిమిత్తం ఆయన మియాపూర్‌ వెళ్లాల్సి రావడంతో ఆయన సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. 

పవన్ కల్యాణ్

మెట్రో స్టేషన్లల్లో సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఆయన చెకింగ్‌ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని అనుసరించారు. దీంతోపాటు ఆయన అమీర్ పేట స్టేషన్‌లో ట్రైన్ సైతం మారి మియాపూర్‌కు వెళ్లారు. అయితే పవన్ మెట్రో ప్రయాణంలో ఆయన వెంట చిత్ర నిర్మాత దిల్‌ రాజు (Dil raju), పలువురు చిత్ర యూనిట్ సిబ్బంది కూడా ఉన్నారు. 

పవన్ కల్యాణ్

ఈ సందర్భంగా పవన్‌ మెట్రోలో తనతోపాటు ప్రయాణిస్తున్న ద్రాక్షరామానికి చెందిన రైతుతో ముచ్చటించారు. ప్రస్తుతం పంటలు ఎలా ఉన్నాయంటూ రైతుతో ఆప్యాయంగా పలకరించగా.. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిందని రైతు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మెట్రో ప్రయాణం తనకు మొదటిసారి అంటూ రైతు చెప్పగానే.. పవన్ కల్యాణ్ నవ్వుతూ.. తనకు కూడా కొత్తెనని.. ఎం కాదంటూ పేర్కొన్నారు. అయితే పవన్ కల్యాణ్‌ను కలవడం పట్ల ఆ రైతు సంతోషం వ్యక్తంచేశారు. Also read: PSPK27 actress: పవన్ కల్యాణ్ సినిమాకు హీరోయిన్ ఫిక్స్ ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News