RTC Bus Accident: వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగారెడ్డి నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 30 మంది ప్రయాణీకులు గాయపడ్డారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 12, 2021, 04:03 PM IST
RTC Bus Accident: వికారాబాద్‌లో ఆర్టీసీ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు

Vikarabad Bus Accident: వికారాబాద్‌ జిల్లా(vikarabad District)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి నుంచి తాండూర్‌ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మర్పల్లి మండలం పరిధిలోని కల్కొడ చౌరస్తా వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా(RTC Bus  overturns in vikarabad) పడింది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రమాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను మర్పల్లి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. 

Also Read: Road accident: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు..

ప్రమాదాని(Road Accident)కి అతివేగమే కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. కల్కొడ గ్రామం సమీపంలో రహదారి ఎత్తుపల్లాలను డ్రైవర్ అంచనా వేయలేకపోవడం వల్లే బస్సు అదుపుతప్పి బోల్తాపడిందని వారు చెప్పారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు(passengers) ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వికారాబాద్‌ జిల్లాలోని మలసోమారం, పెద్దాపూర్‌, ఇందోల్‌, తాండూర్‌, సదాశివపేట్‌, మొరంగపల్లి, కొడంగల్‌, జహీరాబాద్‌, పద్దేముల్‌, కేశారం, తదితర గ్రామాలకు చెందిన ప్రయాణికులు గాయపడ్డారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News