ఎంతటివారైనా సహించేది లేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి

మైనర్ బాలికపై   దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా సహించేదిలేదని తెరాస నాయకులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.  వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో బుధవారం మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన 

Last Updated : May 15, 2020, 10:28 PM IST
ఎంతటివారైనా సహించేది లేదు.. ఎంపీ రంజిత్ రెడ్డి

హైదరాబాద్: మైనర్ బాలికపై   దాడికి పాల్పడిన వారు ఎంతటివారైనా సహించేదిలేదని తెరాస నాయకులు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.  వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో బుధవారం మైనర్ బాలిక పై అత్యాచారానికి పాల్పడిన నిందితులను వెంటనే రిమాండ్ తరలించి వారికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు అధికారులను కోరారు. అలాగే బాధిత మైనర్ బాలిక కుటుంబానికి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు. బాలిక ఆరోగ్యానికి సంబంధించి అన్నీ రకాల సదుపాయాలు అందిస్తామన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులకు చట్టపరంగా తగిన ముద్దు చెప్పాలని ఆయన కోరారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

Read Also: కీలక ప్రకటన చేసిన ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్..
 

Trending News