తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం

తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం

Last Updated : Sep 8, 2019, 12:00 PM IST
తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ రెండో గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో ప్రమాస్వీకారం చేశారు. ముందుగా ఖరారు చేసుకున్న ముహూర్తం ప్రకారమే ఆదివారం ఉ    దయం 11 గంటలకు ఆమె ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ తెలంగాణ గవర్నర్‌గా ఆమె చేత ప్రమాణస్వీకారం చేయించారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, విపక్ష నేతలు, పలు విభాగాల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

అంతకన్నా ముందుగా ఉదయం 9 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న కొత్త గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌‌కు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఎదురు వెళ్లి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ మాజీ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ నిన్న ఇదే ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Trending News