Telangana: మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

తెలంగాణలో కరోనావైరస్ (Coronavirus) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. 

Last Updated : Aug 3, 2020, 06:20 PM IST
Telangana: మరో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కరోనా

TRS mla's tested for Corona positive: హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ ( Coronavirus ) కేసులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీల వరకు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ (Telangana) ప్రజా ప్రతినిధులు ఎక్కువగా కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా అధికార పార్టీకు చెందిన మరో ఇద్దరు టీఆర్ఎస్ ( Trs ) ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. Also read: Director Teja: తేజకు కరోనా పాజిటివ్

పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ( Gudem Mahipal Reddy ), రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ (Korukanti Chandar) కు పాజిటీవ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటికే హోంమంత్రి మహమూద్ అలీతోపాటు మరో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు మేయర్లకు కరోనా సోకింది. అయితే ఇప్పటికే కొంతమంది కరోనా నుంచి కోలుకోగా.. ఇద్దరు ముగ్గురు హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. అయితే మహిపాల్ రెడ్డి, చందర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నవారిని హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. ప్రస్తుతం కరోనా సోకిన ఎమ్మెల్యేల గన్‌మెన్‌లకు, కుటుంబసభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. Also read: నొప్పి లేకుండా చనిపోవడం ఎలా..? గూగుల్‌లో వెతికిన Sushant

Trending News