Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 1,498 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana CoronaVirus Cases | రాష్ట్రంలో తాజాగా 1,498 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 6, 2021, 10:19 AM IST
Telangana COVID-19 Cases: తెలంగాణలో తాజాగా 1,498 కోవిడ్-19 పాజిటివ్ కేసులు

Telangana COVID-19 Positive Cases : తెలంగాణలో కరోనా వైరస్ రెండో దశలో తీవ్రరూపం దాల్చుతోంది.  గత కొన్ని రోజులు కరోనా కేసులు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 1,500 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో తాజాగా 1,498 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,14,735కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

తెలంగాణలో సోమవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 62,350 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో వెయ్యి నాలుగు వందల తొంబై ఎనిమిది  మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 14 వేల 7 వందల ముప్పై ఐదుకు చేరింది. అదే సమయంలో కరోనాతో పోరాడుతూ నిన్న మరో ఆరుగురు మరణించారు. తాజా మరణాలతో కలిపితే తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,729కి చేరింది.

Also Read: Gold Price Today 06 April 2021: బులియన్ మార్కెట్‌లో స్థిరంగా బంగారం, వెండి ధరలు, లేటెస్ట్ రేట్లు ఇవే

దేశంలో ఎన్నడూ లేని విధంగా నిన్న తొలిసారిగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు కోలుకున్న వారి సంఖ్య కన్నా రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రజల్లోనూ కరోనా భయాందోళన పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజు రాష్ట్రంలో చికిత్స అనంతరం కోవిడ్-19 నుంచి 245 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,03,013 మంది కరోనా మహమ్మారిని జయించారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా తీవ్రత అధికం అవుతుంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన పాజిటివ్ కేసులలో జీహెచ్ఎంసీ(GHMC)లోనే ఏకంగా 313 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తెలంగాణలో కరోనా సెకండ్ సేవ్ కారణంగా ప్రభుత్వం అప్రమత్తమైంది. మాస్కులు లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తూ కోవిడ్-19 నిబంధనలు కఠినతరం చేసింది. తెలంగాణలో ప్రస్తుతం 9,993 యాక్టివ్ కేసులు ఉన్నాయి. హోం ఐసోలేషన్‌లో 5,323 మంది చికిత్స పొందుతున్నారు.

Also Read: Horoscope Today: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 06, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధననష్టం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News