Covid-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజులో 18 కరోనా మరణాలు, 6 వేల చేరువలో కేసులు

Telangana Corona Positive Cases | దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,926 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కు చేరింది.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 20, 2021, 10:26 AM IST
Covid-19 Positive Cases: తెలంగాణలో ఒక్కరోజులో 18 కరోనా మరణాలు, 6 వేల చేరువలో కేసులు

Covid-19 Positive Cases: కరోనా వైరస్ రెండో దశలో వేగంగా వ్యాప్తి చెందుతోంది. గాలి ద్వారా  కరోనా వైరస్ రెండో దశలో కేవలం నిమిషం వ్యవధిలో వ్యాప్తి చెందుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులతో పాటు కోవిడ్19 మరణాలు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో తాజాగా 5,926 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,61,359కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి 8 గంటల వరకు గడిచిన 24 గంటల్లో 1,22,143 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 5 వేల 9 వందల ఇరవై ఆరు మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 61 వేల 3 వందల 59కి చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో మరో 18 మంది మంది మరణించారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,856కి చేరింది. ఏప్రిల్ ప్రారంభంలో రెండు, మూడుగా నమోదయ్యే కరోనా(CoronaVirus) మరణాలు తాజాగా 15కి పైగా నమోదవుతున్నాయి. 

Also Read: Corona Cases: భారత్‌కు ప్రయాణాలు చేయవద్దని పౌరులను హెచ్చరించిన అమెరికా ప్రభుత్వం

తెలంగాణలో అత్యధిక కోవిడ్-19(COVID-19) పాజిటివ్ కేసులు గతంలో తరహాలోనే జీహెచ్ఎంసీలోనే నిర్ధారణ అవుతున్నాయి. తాజాగా 793 కరోనా కేసులు జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో నిర్ధారణ కావడం హైదరాబాద్ నగర వాసులను భయాందోళనకు గురిచేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం 42 వేల 853 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1,19,42,985 శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు.

నిన్న ఒక్కరోజు చికిత్స అనంతరం తెలంగాణలో కోవిడ్-19 నుంచి 2,209 మంది కోలుకున్నారు. కాగా, తెలంగాణలో ఇప్పటివరకూ మొత్తం 3,16,650 మంది కరోనా మహమ్మారిని జయించారు. భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్19 నిబందనలైన ముఖానికి మాస్కు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, చేతులను పదే పదే శుభ్రం చేసుకుంటూ ఉండటం వల్ల కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు.

Also Read; EPF Withdrawal Conditions: ఈపీఎఫ్ ఖాతాదారులు ఈ సందర్భాల్లో Cash విత్‌డ్రా చేయవచ్చు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News