తెలంగాణలో వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడి

Last Updated : Mar 13, 2019, 12:06 PM IST
తెలంగాణలో వెల్లడైన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు

హైదరాబాద్‌: తెలంగాణలో నేడు శాసన సభ్యుల కోటా కింద నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన నలుగురు అభ్యర్థులు, ఎంఐఎం నుంచి ఒకరు విజయం సాధించారు. టీఆర్ఎస్ నుంచి మహమూద్‌ అలీ, శేరి సుభాష్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ఎగ్గె మల్లేశం ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. ఎంఐఎం పార్టీ తరపున బరిలో నిలిచిన మీర్జా రియాజ్‌ హసన్‌ గెలుపొందారు. 

షెడ్యూల్ ప్రకారమే మంగళవారం ఉదయం జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు చెందిన 91 మంది, ఎంఐఎంకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సరైన మద్ధతు లేకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీ, టీటీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో పోటీలో నిలిచిన టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు పరస్పరం సహకరించుకోవడంతో ఇరు పార్టీలకు పోటీలేకుండాపోయింది.

Trending News