WHO: వేగవంతమైన సామాజీకరణ వల్ల పెను ముప్పు తప్పదు

కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది

Last Updated : Sep 1, 2020, 02:44 PM IST
    • కరోనావైరస్ ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది.
    • భారత దేశంలో అన్ లాక్ 4 ప్రారంభం అవుతున్న సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ హెచ్చరించారు.
    WHO: వేగవంతమైన సామాజీకరణ వల్ల పెను ముప్పు తప్పదు

    కరోనావైరస్ ( Coronavirus ) ప్రభలుతున్న సమయంలో పరిస్థితులను సాధారణంగా మార్చేందుకు వివిధ దేశాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల వల్ల భవిష్యత్తులో మరింత ప్రమాదరకమైన పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ( WHO ) హెచ్చరించింది. భారత దేశంలో అన్ లాక్ 4 ప్రారంభం అవుతున్న సందర్భంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ టెడ్రోస్ ఆధ్నామ్ ఘాబ్రియోసిస్ ( Tedros Adhanom Ghebreyesus ) హెచ్చరించారు.

    ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ కేసుల సంఖ్య 25.6 మిలియన్లకు చేరుకుంది. ఇప్పటి వరకు సుమారు 8 లక్షల 54 వేల మంది వైరస్ వల్ల మరణించారు. రోజు రోజుకూ కేసుల సంఖ్య మరింతగా పెరగుతోంది. 

    ఇలాంటి సమయంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు లాక్ డౌన్ ను ఎత్తేసి సాధారణ, పూర్వ పరిస్థితులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సందర్భంగా టెడ్రోస్ ఆధ్నామ్ ఒక వీడియో విడుదల చేశారు. గత ఆరునెలలుగా ఆ మహమ్మారితో కలిసి పోరాడుతున్నాము. పోరాటం చాలు అని చాలా మంది సాధారణ పరిస్థితికి వెళ్లిపోతున్నారు. కానీ కరోనా మహమ్మారి ఆట ముగిసింది ఏ దేశమూ నిర్ధారించలేదు అని ఆయన వీడియోలో మాట్లాడారు.

     

    Trending News

    By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

    x