ఏపీలో తాజాగా 82 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus Cases In AP) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 82  మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 40 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ అయ్యారు.

Last Updated : Jun 2, 2020, 02:16 PM IST
ఏపీలో తాజాగా 82 కరోనా కేసులు.. అదొక్కటే ఊరట

Andhra Pradesh Corona Positive Cases - ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (CoronaVirus Cases In AP) కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా 82  మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 40 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ కాగా, ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం.  ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా

గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరింది. ఇందులో 2209 మంది కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ కాగా, ఇప్పటివరకూ ఏపీలో 64 మంది మరణించారు. ప్రస్తుతం 927 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్

కాగా, విదేశాల నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఇప్పటివరకూ 112 మందికి కరోనా నిర్ధారించారు. ఇందులో ఒకరు కోలుకుని డిశ్ఛార్జ్‌ కాగా, మిగతావన్నీ యాక్టీవ్ కేసులే. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని పరీక్షించగా 479 మందికి పాజిటివ్ గా తేలగా.. ఇందులో కొందరు కరోనా బారి నుంచి కోలుకుని డిశ్ఛార్జ్ అయ్యారు. ప్రస్తుతం 282 మంది చికిత్స పొందుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి

Trending News