Pension Kanuka Hike: పెరిగిన వైఎస్​ఆర్​ పెన్షన్​ కానుక- ఇకపై రూ.2,500

YSR Pension Kanuka Hike: ఏపీలో పెన్షన్​దారులకు ప్రభుత్వం గుడ్​ న్యుస్ చెప్పింది. వైఎస్ఆర్​ పెన్షన్​ కానుక మొత్తం పెంపును అమలు చేసింది. సీఎం జగన్​ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 1, 2022, 07:04 PM IST
  • ఏపీలో పెరిగిన పెన్షన్​ సహాయం
  • ఇకపై రూ.2,500 పొందనున్న పెన్షన్​దారులు
  • గుంటులో లబ్ధిదారులకు పెన్షన్ అందజేసిన సీఎం
Pension Kanuka Hike: పెరిగిన వైఎస్​ఆర్​ పెన్షన్​ కానుక- ఇకపై రూ.2,500

YSR Pension Kanuka Hike: వైఎస్ఆర్​ పెన్షన్ల కానుక పెంపును ప్రారంభించారు ఆంధ్ర ప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు (YSR Pension Kanuka Increased) సీఎం.
దీనితో వృద్ధులు, వితంతువులకు పెన్షన్​ రూ.2,250 నుంచి రూ.2,500కు పెరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం లబ్దిదారుల్లో కొంత మందికి నేరుగా వైఎస్​ఆర్​ పెన్షన్ కానుకను అందించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్​.. కొత్త సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకోవడం సంతోషంగా ఉందని వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీని నిలబెట్టుకున్నట్లు తెలిపారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం పెన్షన్ పెంపు పథకంపైనే చేసినట్లు గుర్తు (CM Jagan on YSR Pension Kanuka) చేశారు.

పెరిగిన లబ్ధిదారులు..

ఈ  నెల నుంతి కొత్తగా 1.51 లక్షల మంది కొత్తగా పెన్షన్​ పరిధిలోకి వచ్చినట్లు ఏపీ పంచాయితీ రాజ్​ శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు వివరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజులపాటు ఈ కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు మంత్రి రామచంద్రా రెడ్డి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులంతా.. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారని పేర్కొన్నారు.

మరిన్ని..

పెన్షన్​ కోసం రూ.1,570.60 కోట్లను ఖర్చు చేయనుంది ఏపీ ప్రభుత్వం.

దీర్ఘకాలిక వ్యాధులు, గుర్తించిన ఆనారోగ్యాలతో బాధపడుతున్న వారికి కూడా మెడికల్ పెన్షన్లను అందిస్తోంది ప్రభుత్వం. లబ్ధిదారులకు రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ఈ విధమైన పెన్షన్​లు ఇస్తోందని ఇటీవల ప్రభుత్వం వెల్లడించింది.

Also read: Ap Cm Ys Jagan: పథకాల్ని అడ్డుకునేవారంతా నిరుపేదల శత్రువులే : వైఎస్ జగన్

Also read: Jahnavi Dangeti: ఆంధ్ర అమ్మాయి జాహ్నవి రికార్డ్.. నాసా ట్రైనింగ్‌లో పాల్గొన్న మొదటి భారతీయురాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News