AP PGCET 2021: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల.. 87.62 శాతం మంది ఉత్తీర్ణత

AP PGCET 2021: ఏపీ పీజీ సెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో రిలీజ్ చేశారు. ఇందులో  24 వేల మంది విద్యార్థులు అర్హత సాధించారు.     

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2021, 04:43 PM IST
  • ఏపీ పీజీసెట్‌ ఫలితాలు రిలీజ్
  • 24 వేల మంది అర్హత
  • ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరు
AP PGCET 2021: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల.. 87.62 శాతం మంది ఉత్తీర్ణత

AP PGCET 2021 Results: ఏపీ పీజీసెట్‌ 2021 ఫలితాలను విద్యాశాఖమంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ మంగళవారం విడుదల చేశారు. 

మంత్రి ఆదిమూలపు సురేష్‌(Adimulapu Suresh) మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ ప్రవేశాలకి ఒకే సెట్ మొదటిసారిగా నిర్వహించాం.  ఆన్‌లైన్(online)లో నిర్వహించిన ఈ పరీక్షా ఫలితాలని రెండు వారాలలో ప్రకటించాం. పీజీ ప్రవేశాలకి 39,856 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రవేశ పరీక్షకి 35,573 మంది హాజరుకాగా 24,164 మంది అర్హత పొందారు. పీజీ సెట్‌(AP PGCET 2021)లో 87.62 శాతం మంది అర్హత సాధించారు.

Also Read: MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

గతంలో అన్ని యూనివర్సిటీలకి ఒకే ప్రవేశ పరీక్ష ఉండకపోవడం వల్ల విద్యార్ధులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ ప్రవేశ పరీక్ష వల్ల అర్హత సాధించిన విద్యార్ధులు తమకు ఇష్ణమైన కోర్సులలో నచ్చిన యూనివర్సిటీలో చేరవచ్చు. ఉన్నత విద్యలో సీఎం వైఎస్ జగన్(CM Jagan) విప్లవాత్మకమైన మార్పులు చేపట్టారు. ప్రవేశపరీక్షలలో ఎటువంటి అవకతవకులకు  ఆస్కారం లేకుండా కట్డుదిట్టంగా విజయవంతంగా నిర్వహించాం అని మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News