తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్పందించిన నారా లోకేష్

ముందస్తు ఎన్నికలపై నారా లోకేష్ స్పందన

Last Updated : Sep 4, 2018, 09:12 PM IST
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై స్పందించిన నారా లోకేష్

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రావచ్చనే ఊహాగానాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను వేడెక్కిస్తున్న ప్రస్తుత తరుణంలో ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ అంశంపై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా.. ఎన్నికలు ఎదుర్కునేందుకు తెలుగు దేశం పార్టీ సిద్ధంగానే ఉందని నారా లోకేష్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లోనూ టీడీపీ పోటీ చేస్తుందని ఈ సందర్భంగా లోకేష్ తేల్చిచెప్పారు. 

తెలంగాణలో కొంతమంది టీడీపీ నేతలు పార్టీని వీడినప్పటికీ పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని చెబుతూ పార్టీ కేడర్ ఇప్పటికీ అలాగే పార్టీ వెన్నంటి ఉందని అన్నారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో టీడీపీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రశ్నకు లోకేష్ స్పందిస్తూ.. ఆ అంశాన్ని పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించిన అనంతరం అంతిమ నిర్ణయం తీసుకుంటామని సమాధానం ఇచ్చారు.  

Trending News