ఎవరు ఎంత తిన్నారో లెక్క చెబుతాం: మంత్రి బొత్స

ఎవరు ఎంత తిన్నారో లెక్క చెబుతాం: మంత్రి బొత్స 

Last Updated : Aug 14, 2019, 07:19 PM IST
ఎవరు ఎంత తిన్నారో లెక్క చెబుతాం: మంత్రి బొత్స

విశాఖపట్నం: జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ సర్కార్ భారీ దోపిడీకి పాల్పడిందని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సదస్సుల పేరుతో ఎన్ని పరిశ్రమలను తీసుకువచ్చారో చంద్రబాబు జవాబు చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో భారీగా ఇసుక దోపిడీ జరిగిందని అన్నారు. అంతేకాకుండా ఆఖరికి అన్న క్యాంటిన్లలోనూ భారీ ఎత్తున అవినీతి జరిగిందన్న మంత్రి బొత్స.. రెండు రోజులు ఆగితే ఎవరు, ఎంత తిన్నారో లెక్కలతో సహా చెబుతామని పేర్కొన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఈ సందర్భంగా చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకుపడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టులేవీ చంద్రబాబు పూర్తి చెయ్యలేదు కానీ నదుల అనుసంధానం పేరుతో నిధుల అనుసంధానం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాజెక్టులు నిండుకుండలా కళకళలాడుతుండటం చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని చెబుతూ.. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువేనని ఎద్దేవా చేశారు.

Trending News