Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- 10 మంది ప్రయాణికులు మృతి

Breaking News: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు వంతెనపై నుంచి వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు మరణించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2021, 03:48 PM IST
    • పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఘోర ప్రమాదం
    • ప్రమాదవశాత్తులో పెద్ద వాగులో పడిపోయిన ఆర్టీసీ బస్సు
    • 10 మంది ప్రయాణికులు మృతి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు
Breaking News: వాగులో పడిన ఆర్టీసీ బస్సు- 10 మంది ప్రయాణికులు మృతి

Breaking News: పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు బస్సు వంతెనపై నుంచి పెద్ద వాగులో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. 

ప్రమాదానికి ముందు ఆ బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అయితే అందులో ఎంత మంది మరణించారు.. లేదా ఎంత మంది గాయపడ్డారనే వివరాలు తెలియాల్సిఉంది. 

బస్సు వాగులో పడిపోయిందన్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు, అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి కారణమేంటే తెలియాల్సిఉంది. 

Also Read: AP Special Status: ఏపీ ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో గళమెత్తిన వైసీపీ ఎంపీలు

Also Read: AP movie tickets : ఏపీలో మూవీ టికెట్ల రేట్లు తగ్గిస్తూ ఇచ్చిన జీవో రద్దు, తీర్పు ఇచ్చిన హైకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News