Chittoor District: కారులో చెలరేగిన మంటలు... చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం!

AP News: చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై ఓ కారులో మంటలు చెలరేగడంతో...ఐదుగురు సజీవ దహనమయ్యారు.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 5, 2021, 04:03 PM IST
Chittoor District: కారులో చెలరేగిన మంటలు... చిన్నారి సహా ఐదుగురు సజీవదహనం!

Chittoor Accident: చిత్తూరు జిల్లా(Chittoor District)లో ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. పూతలపట్టు-నాయుడుపేట హైవేపై అగరాల వద్ద డివైడర్ ను ఢీకొన్న కారు బోల్తా కొట్టింది. దీంతో కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడ్డ మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Eluru:భర్త లింగమార్పిడి-వేరే వ్యక్తితో ఆమె సహజీవనం-చివరకు విషాదాంతం

ప్రమాదం జరిగిన కారు నంబరు AP 39 HA 4003 గా గుర్తించారు.  క్షతగాత్రులను రుయా(Ruya hospital) ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్డమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను మార్చురీకి తరలించారు. మృతులు విజయనగరం జిల్లా వాసులుగా భావిస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x