Guntur: కాల్వలోకి దూసుకెళ్లిన ‌కారు.. న‌లుగురు తెలంగాణవాసులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Car Accident In Guntur District)లో నలుగురు తెలంగాణవాసులు దుర్మరణం చెందారు. తెల్లవారుజామున కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నీట మునిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Last Updated : Oct 16, 2020, 07:57 AM IST
Guntur: కాల్వలోకి దూసుకెళ్లిన ‌కారు.. న‌లుగురు తెలంగాణవాసులు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident in Guntur) సంభవించింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో నలుగురు వ్యక్తులు  మృతి చెందారు. శుక్రవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా జ‌గిత్యాల (Jagtial) జిల్లా ధ‌ర్మపురికి చెందిన‌వార‌ని పోలీసులు వెల్లడించారు. 

 

నలుగురు వ్యక్తులు హైదరాబాద్ (Hyderabad) నుంచి ప్రకాశం జిల్లా పామర్రు వైపుగా కారులో వెళ్తున్నారు. గుంటూరు జిల్లాకు చేరుకోగా, రొంపిచర్ల - సుబ్బయ్య పాలెం మధ్య అదుపుతప్పిన కారు తంగేడుపల్లి పెద్ద కాల్వలోకి దూసుకెళ్లింది. నీట మునగడంతో కారులో ప్రయాణిస్తున్న వారు మరణించారని పోలీసులు భావిస్తున్నారు. మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని నరసారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News