Gunfire In AP: కడప జిల్లాలో కాల్పుల కలకలం, ఒకరి హత్య, ఆపై ఏం చేశాడంటే

Gunfire In Pulivendula, Kadapa: ఆస్తి వివాదం కాల్పులకు దారితీసింది. ఏకంగా ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. ఏపీలోని కడప జిల్లాలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. వ్యక్తిగత కక్షతో తుపాకీతో కాల్పులు జరిపి ఓ వ్యక్తిని హత్య చేశాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 15, 2021, 09:06 AM IST
  • ఏపీలోని కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి
  • పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లెలో తుపాకీతో వీరంగం
  • ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేసిన ఎంపీపీ
Gunfire In AP: కడప జిల్లాలో కాల్పుల కలకలం, ఒకరి హత్య, ఆపై ఏం చేశాడంటే

Gunfire In Pulivendula, Kadapa: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. పులివెందుల మండ‌లంలో ఓ ఎంపీపీ కాల్పులు జరపగా, ఓ వ్యక్తి చనిపోయాడు. హత్య కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆస్తికి సంబంధించిన వివాదాలతో ఈ హత్య జరిగి ఉండొచ్చునని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

కడప జిల్లా పులివెందుల మండ‌లం న‌ల్లపురెడ్డిప‌ల్లెలో కాల్పులు జరిగాయి. ఎంపీపీ శివ‌ప్రసాద్‌రెడ్డి తుపాకీతో వీరంగం చేశారు. పార్థసార‌థి అనే వ్యక్తిపై శివప్రసాద్‌రెడ్డి కాల్పులు (Gunfire In Pulivendula) జరిపి హత్యచేశారు. అనంతరం తుపాకీతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన స్థానిక ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు శివప్రసాద్‌రెడ్డి గాయపడగా, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: YSR Vahanamitra scheme: వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆర్థిక సాయం నేటి నుంచే ఖాతాల్లోకి 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News