ఆంధ్రా కోసం నేను వున్నాను కదా.. డోంట్ వర్రీ

ప్రధాని మోడీని కలిసిని టీడీపీ ఎంపీలు తమ ఆవేదనను అంతా ఓ వినతి పత్రం రూపంలో ఆయన ముందు పెట్టారు.

Last Updated : Jan 6, 2018, 04:06 PM IST
ఆంధ్రా కోసం నేను వున్నాను కదా.. డోంట్ వర్రీ

"ఐయామ్ ఫర్ ఆంధ్రా.. నేను చూసుకుంటాను కదా.. డోంట్ వర్రీ"! ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే. శుక్రవారం తనని కలిసిన టీడీపీ ఎంపీలతో ప్రధాని మోడీ అన్న మాటలివి. రాష్ట్ర విభజన సందర్భంలో ఇచ్చిన హామీలని నెరవేర్చలేదని రాష్ట్ర విభజన సమస్యలని తన దృష్టికి తీసుకొచ్చిన ఏపీ టీడీపీ ఎంపీలకి తాను వున్నానని అభయం ఇస్తూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు ఇవి. 

ప్రధాని మోడీని కలిసిని టీడీపీ ఎంపీలు తమ ఆవేదనను అంతా ఓ వినతి పత్రం రూపంలో ఆయన ముందు పెట్టారు. దీంతో వారి విజ్ఞప్తిపై స్పందించిన మోడీ.. ఇదే విషయమై చర్చించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అపాయింట్‌మెంట్ కోరారని, త్వరలోనే బాబుతో చర్చించి ఏపీ రాష్ట్ర సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేస్తానని టీడీపీ ఎంపీలకి స్పష్టమైన హామీ ఇచ్చారు. అందుకే ఇకపీ ఈ వ్యవహారం గురించి ఆందోళన వద్దని టీడీపీ ఎంపీలకు నచ్చచెప్పే సందర్భంలో  "అయామ్ ఫర్ ఆంధ్ర. డోంట్ వర్రీ" ఇక మీరు నిశ్చింతగా వుండండి అని అన్నారట మోడీ.

Trending News