అన్నయ్య చిరంజీవి మాటే వినను.. నీ మాటెందుకు వింటాను: పవన్

అన్నయ్య చిరంజీవి మాటే వినను.. నీ మాటెందుకు వింటాను: పవన్

Last Updated : Apr 8, 2019, 06:32 PM IST
అన్నయ్య చిరంజీవి మాటే వినను.. నీ మాటెందుకు వింటాను: పవన్

రాజమండ్రి: టీడీపీ నేత తోట త్రిమూర్తులుపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలుగు దేశం పార్టీ, జనసేన పార్టీ వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని తోట త్రిమూర్తులు ప్రజల్లో దుష్ప్రచారం చేస్తున్నారని, అలా వాస్తవాలతో సంబంధం లేకుండా దుష్ప్రచారం చేసే తోట త్రిమూర్తులు లాంటి వారిని చెంచాలు అంటారని పవన్‌ కల్యాణ్ పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో రోడ్ షో నిర్వహించిన సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ ''నా అన్న చిరంజీవి మాటే వినను... నీ మాట వింటానని ఎలా అనుకున్నావ్ అని తోట త్రిమూర్తులును ఉద్దేశించి ప్రశ్నించారు. వేరే కులం వాడిననే ఉద్దేశంతో తనను రాజకీయంగా దెబ్బకొట్టాలని కుట్ర పన్నుతున్నారని పవన్ ఆరోపించారు.

Trending News