భూములను లాక్కుంటే ఖబడ్దార్: పవన్ కళ్యాణ్

శెట్టిపల్లిలో భూ నిర్వాసితులతో పవన్ కళ్యాణ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Last Updated : May 18, 2018, 09:51 AM IST
భూములను లాక్కుంటే ఖబడ్దార్: పవన్ కళ్యాణ్

రైతుల భూములను ప్రభుత్వం లాక్కుంటే చూస్తూ ఊరుకోమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. చిత్తూరు జిల్లాలో ఉన్న పవన్ కళ్యాణ్ శెట్టిపల్లిలో భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం గ్రామాల మధ్య వివక్ష చూపుతోందని విమర్శించారు. టీడీపీకి సపోర్ట్‌ చేసే గ్రామానికి ఓ న్యాయం, లేకపోతే మరో న్యాయమా? అని ప్రశ్నించారు.

అన్నదాతల భూములు లాక్కోవడం సరికాదని, శెట్టిపల్లి భూముల జోలికొస్తే చూస్తూ ఖబడ్దార్ అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులకు అండగా లేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. దోపిడీ జరుగుతుంటే మౌనంగా కూర్చునే రోజులు పోయాయన్నారు. శెట్టిపల్లె భూములు ఇవ్వడానికి జనసేన అంగీకరించదన్నారు.

తూర్పు గోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన లాంచీ దుర్ఘటన బాధాకరమని  ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ అన్నారు. జనసేన కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని.. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని సూచించారు.

Trending News