MP Vijayasai Reddy: ఇవి పిల్ల చేష్టలు.. బాలయ్య అల్లుళ్లపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

MP Vijayasai Reddy Fires on Nara Lokesh: రాజకీయ కక్షతోనే తమ ప్రైవేట్ స్థలంలో ప్రహారీని కూల్చివేస్తున్నారని ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. తోడళ్లులు నారా లోకేష్, ఎంపీ భరత్ పిల్ల చేష్టలుగా భావిస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.   

Written by - Ashok Krindinti | Last Updated : Sep 21, 2024, 01:06 PM IST
MP Vijayasai Reddy: ఇవి పిల్ల చేష్టలు.. బాలయ్య అల్లుళ్లపై ఎంపీ విజయసాయి రెడ్డి ఫైర్

MP Vijayasai Reddy Fires on Nara Lokesh: ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డికి సంబంధించిన స్థలంలో నిర్మాణాలను జీవీఎంసీ అధికారులు మరోసారి కూల్చివేతలు చేపట్టారు. CRZ నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీబీలతో కూల్చేస్తున్నారు. నేహరెడ్డికి సంబంధించిన నాలుగు ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలు ఉన్నాయని ఆరోపణలు ఉన్నాయి. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మించారని కూల్చివేతలు చేపట్టారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తియాదవ్ అక్రమ కట్టడాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఉత్తర్వులతో రెండు వారాల క్రితమే కూల్చివేతలు చేపట్టారు. తాజాగా శనివారం మరోసారి చర్యలు తీసుకున్నారు.

Also Read: Tirumala Laddu Controversy: కల్తీ లడ్డూ తిని ఎవరైనా చనిపోయారా? లడ్డూ బూందీ అంటూ రాజకీయాలు చేయొద్దు: సీమాన్

ఈ విషయంపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. వైజాగ్ ఎంపీ భరత్ మత్తుకుమిల్లి, మంత్రి నారా లోకేష్ తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో తమ ప్రైవేట్ స్థలంలో ఈరోజు మళ్లీ రెండోసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కొంపను ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేశామని.. బుద్ధిహీనత వల్ల మీరు అది చేయలేరన్నారు. నారా చంద్రబాబు నాయుడు నిఖార్సయిన నాయకుడైతే క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని సవాల్ విసిరారు. 

==> "తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు. 
==> విజయవాడలో 50కు పైగా గుళ్ళు  ఎందుకు కూల్చావు. 
==> దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసావు. 
==> బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.
==> రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు. 
==> పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విషప్రచారం చేసావు. 
==> నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు. 
==> ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను చీ కొడుతున్నాడు.  
==> ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత. 
==> ఆరోపణలే తప్ప నీ జీవితం లో నిరూపణలు వుండవు. 
==> బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని  తుడుచుకో అంటావు. 
==> నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు. 
==> ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు. 
==> విలువలకు  ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా! 
==> దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు. 
==> కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు.  
==> నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు. 
==> నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం." అని విజయసాయి రెడ్డి మండిపడ్డారు. 

Also Read: Jani Master: జానీ మాస్టర్ లీలలు ఓ రేంజ్ లో..  ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు.. ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News