నారా బ్రాహ్మణికి కేంద్ర ప్రభుత్వ అవార్డు

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కేంద్ర ప్రభుత్వ అవార్డు వరించింది.

Last Updated : Dec 15, 2017, 10:34 AM IST
నారా బ్రాహ్మణికి కేంద్ర ప్రభుత్వ అవార్డు

ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణిని కేంద్ర ప్రభుత్వ అవార్డు వరించింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంధనం ఆదా చేస్తున్న ఉత్తమ సంస్థగా హెరిటేజ్ ఫుడ్స్ ఎంపిక కావడంతో ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ హోదాలో బ్రాహ్మణి ఈ అవార్డును అందుకున్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో నారా బ్రాహ్మణి ఈ అవార్డును  కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ చేతుల మీదుగా అందుకోవడం గమనార్హం.

ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఇంధన ఆదా సదస్సు - 2017లో దేశవ్యాప్తంగా ఇంధనం ఆదా చేస్తున్న పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు అవార్డులను ప్రకటించారు. ఈ క్రమంలో ఈ సంవత్సరం తమ ఎలక్ట్రికల్ సేవింగ్స్‌ను 14.5% తగ్గించినందుకు గాను హెరిటేజ్ ఫుడ్స్ కూడా ఈ అవార్డును పొందడం గమనార్హం. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x