Surya Grahanam, Chandra Grahanam: ఆ 2 రోజులు 12 గంటల పాటు దర్శనం బంద్

Surya Grahanam, Chandra Grahanam: అక్టోబర్ 25 నాడు సూర్య గ్రహణం కానుండగా నవంబర్ 8 నాడు చంద్ర గ్రహణం కానుంది. ఈ నేపథ్యంలో ఆ రెండు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం 12 గంటల పాటు దర్శనం మూసివేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.

Written by - Pavan | Last Updated : Oct 11, 2022, 11:40 PM IST
  • అక్టోబర్ 25 నాడు సూర్య గ్రహణం
  • నవంబర్ 8 నాడు చంద్ర గ్రహణం
  • ఆ రెండు రోజుల్లో శ్రీవారి దర్శనం ఉంటుందా లేదా అనే వివరాలు వెల్లడించిన టిటిడి బోర్డు
Surya Grahanam, Chandra Grahanam: ఆ 2 రోజులు 12 గంటల పాటు దర్శనం బంద్

Surya Grahanam, Chandra Grahanam: సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడనున్న ఆ రెండు రోజుల్లో సర్వ దర్శనం మినహా మిగతా అన్ని దర్శనాలు నిలిపేస్తున్నట్టు టిటిడి వెల్లడించింది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధ్వర్యంలోని అన్నప్రసాదం కాంప్లెక్స్ కూడా మూసే ఉంటుందని టిటిడి స్పష్టంచేసింది.

అక్టోబర్ 25న సాయంత్రం 5.11 గంటల నుండి 6.27 గంటల మధ్య సూర్య గ్రహణం ఏర్పడనుండగా ఆ రోజు ఉదయం 8.11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు దర్శనం ద్వారాలు మూసే ఉండనున్నాయి. సూర్య గ్రహణం అనంతరం దేవాలయం శుద్ధి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత దేవాలయం ద్వారాలు భక్తులకు దర్శనం కోసం తెరుచుకోనున్నాయి. 

అలాగే నవంబర్ 8న చంద్ర గ్రహణం రోజున కూడా మధ్యాహ్నం 2.39 గంటల నుంచి సాయంత్రం 6.19 గంటల వరకు చంద్ర గ్రహణం ఏర్పడే సమయం కానుండగా.. ఆ రోజు ఉదయం 8.40 గంటల నుండి రాత్రి 7.20 గంటల వరకు దేవాలయం ద్వారాలు మూసే ఉండనున్నాయి. 

విఐపి బ్రేక్ దర్శనం, శ్రీవారి ట్రస్ట్ దర్శనం, రూ. 300 శీఘ్ర దర్శనంతో పాటు ఆర్జిత సేవ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ కూడా నిలిపేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టచేసింది. అంతేకాకుండా వయో వృద్ధులు, దివ్యాంగులు, పసికందులతో దర్శనానికి వచ్చే తల్లిదండ్రులు, ఎన్నారైలు, రక్షణ శాఖ సిబ్బంది సహా అందరికీ దర్శనం నిలిపేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తేల్చిచెప్పింది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఏర్పడే ఆ రెండు రోజుల్లోనూ ఆలయం శుద్ధి చేసిన తర్వాత సర్వ దర్శనం కోసం వచ్చే భక్తులకు మాత్రమే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ద్వారా దర్శన భాగ్యం కల్పించనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తాజా ప్రకటనలో పేర్కొంది.

ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం గ్రహణం పట్టిన సమయంలో వంటలు చేసే ఆచారం లేకపోవడం వల్లే ఆ సమయంలో వెంగమాంబ కాంప్లేక్సులో అన్న ప్రసాదం సేవలు కూడా అందించలేకపోతున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టంచేసింది. సూర్య గ్రహణం ఏర్పడనున్న అక్టోబర్ 25 నాడు, చంద్ర గ్రహణం ఏర్పడనున్న నవంబర్ 8 నాడు తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నట్టు టిటిడి బోర్డు ప్రకటించింది.

Also Read : Gajakesari Yoga: మీనరాశిలో గజకేసరి యోగం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారమే

Also Read : Shani Margi 2022: ప్రత్యక్ష సంచారంలోకి శనిదేవుడు... ఇక వీరి ఇంటి నిండా డబ్బు కట్టలే..!

Also Read : Mercury transit 2022: తులరాశిలోకి బుధుడు... ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x