ఏ జైలుకెళ్తావ్ చంద్రన్నా..

రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైస్సార్సీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడని,

Last Updated : Feb 23, 2020, 07:53 PM IST
ఏ జైలుకెళ్తావ్ చంద్రన్నా..

అమరావతి: రాష్ట్రంలో ప్రతిపక్ష టీడీపీ, అధికార వైస్సార్సీపీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి మాట్లాడుతూ..  మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దోచుకున్న ప్రతి రూపాయిలో సగం లోకేశ్ కు పంపించాడని, పార్టీ అండగా నిలవక పోతే డైరీలన్నీ బయటకు తీస్తానని బెదిరిస్తున్నాడని, లోకేశ్ చెబితేనే లేఖ రాశానని సన్నిహితుల వద్ద వాపోతున్నాడని అన్నారు. తండ్రీ కొడుకుల కనుసన్నల్లోనే కుంభకోణం జరిగిందని పేర్కొన్నారు. 

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ.. ఆజైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా? ఆ పక్కనేమో వైజాగ్ సెంట్రల్, ఈ పక్కనేమో కడప కారాగారం. నడిమధ్యనున్నది రాజమండ్రి చెరసాల... అని సోషల్ మీడియా కుర్రకారు తెగ ఊగిపోతున్నారు. పాపం అసలే ఎండాకాలం. రెండు ఏసీలేసుకుని పడుకునే వాడు. ఎలా తట్టుకుంటాడో ఏమో? అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. 

కాగా, తెలుగు దేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో స్పందిస్తూ.. ఇందులో నీ ఫోటో కూడా ఒక మూల పెడితే, ఫోటో సరిగ్గా సెట్ అయ్యేది , ఏ2 తాతా ? అని వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నిమ్మగడ్డ ఇచ్చిన సమాచారంతో, సెర్బియా గోడల పై, నీ ఫోటో కూడా అంటించారు అంట. ఏది ఒకసారి సెర్బియా వెళ్లిరా.. అని ట్వీట్ చేశారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News