Road Accident in Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు కార్మికులు దుర్మరణం..

Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2023, 08:37 AM IST
Road Accident in Sangareddy: ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ ఢీకొని ముగ్గురు కార్మికులు దుర్మరణం..

Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ భీభత్సం సృష్టించింది. ఓఆర్ఆర్ పై నుంచి పక్కనే ఉన్న గుడిసెలోకి లారీ దూసుకెళ్లింది. అంతటితో ఆగకుండా ఈ వాహనం అక్కడే చెట్లకు నీళ్లు పోస్తున్న ముగ్గురు కార్మికులను ఢీకొట్టి బోల్తాపడింది. వారు అక్కడిక్కడే మృతి చెందారు. కొందరు గాయపడినట్లు తెలుస్తోంది. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. పటాన్‌చెరు నుంచి శంషాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు బాబు రాథోడ్ (48), కమలీబాయ్ (43), బసప్ప రాథోడ్ (23) గుర్తించారు. లారీ అదుపుతప్పడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. లారీ డ్రైవర్ పరారైనట్లు తెలుస్తోంది. సీసీటీవీ పుటేజీ ద్వారా లారీ డ్రైవర్ ను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. 

Also Read: King Fisher Beers Sales: కింగ్ ఫిషర్ బీర్లు అమ్మడం లేదని కలెక్టర్‌కి ఫిర్యాదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News