Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు దుర్మరణం..

Road Accident in Karnataka: కర్ణాటకలో ఊహించని విషాదం జరిగింది. ట్రక్కు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు కూలీలు దుర్మరణం పాలయ్యారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2022, 11:51 AM IST
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మహిళలు  దుర్మరణం..

Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, ఆటో ఢీకొన్న ఘటనలో ఏడుగురు మహిళలు దుర్మరణం చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్ధరాత్రి సమయంలో బీదర్ జిల్లా చిటగుప్ప తాలూకా బెమ్మల్‌ఖెడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. మృతి చెందిన వారంతా కూలీలే. వీరిందరూ పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

మృతులను పార్వతి (40), ప్రభావతి (36), గుండమ్మ (60), యాదమ్మ (40), జగ్గమ్మ (34) ఈశ్వరమ్మ (55), రుక్మిణి బాయి (60)గా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిలో వారిలో రెండు వాహనాల డ్రైవర్లు కూడా ఉన్నారు. యాక్సిడెంట్ లో గాయపడిన వారిని బీదర్ జిల్లా ఆసుపత్రికి  తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా ఉడమనల్లి గ్రామానికి చెందినవారిగా సమాచారం. 

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

తెలంగాణ వికారాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంభవించింది. ఆటో-లారీ ఢీకొన్న ఐదుగురు దుర్మరణం చెందారు. మరికొంత మందికి గాయాలయ్యాయయి.  వీరంతా కూలీలుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతుల కుటుంబాలను ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి పరామర్శించారు. మృతి చెందిన వారంతా పెద్దేముల్ మండలం మదనంతాపూర్ వాసులుగా తెలుస్తోంది. 
 

Also Read: Heavy Rains: భారీ వర్షాలతో అతలాకుతలం.. అక్కడ పాఠశాలలకు సెలవు 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News