Delhi Murder Case: యువతి దారుణ హత్య.. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన బాయ్‌ఫ్రెండ్

Delhi Crime News: ఢిల్లీలో యువతి అదృశ్యం కేసును పోలీసులు ఛేదించారు. యువతిని ప్రియుడు దారుణంగా హత్య చేసినట్లు గుర్తించారు.  మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రీజ్‌లో దాచి పెట్టినట్లు గుర్తించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2022, 01:19 PM IST
Delhi Murder Case: యువతి దారుణ హత్య.. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిజ్‌లో దాచిపెట్టిన బాయ్‌ఫ్రెండ్

Delhi Crime News: ఢిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ప్రేమించి తనతో పాటు వచ్చిన యువతిని ఓ యువకుడు దారుణంగా హత్య చేశాడు. ఆమె మృతదేహాన్ని మాయం చేసేందుకు 35 ముక్కలుగా కట్ చేశాడు. రోజుకు కొన్ని ముక్కలు వివిధ ప్రదేశాల్లో పడేస్తూ గుట్టుగా తిరుగుతున్నాడు. యువతి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు చివరికి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. సంచలనం రేకెత్తించిన యువతి హత్య కేసు వివరాలు ఇలా..   

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వికాస్ మదన్ అనే వ్యక్తి భార్య, పిల్లలతో కలిసి నివసిస్తున్నాడు. అతని కూతురు శ్రద్ధ (26) ముంబైలో మలాడ్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తోంది. అక్కడ ఆమెకు అఫ్తాబ్ అమీన్‌ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది. కొద్దిరోజులు ఇద్దరు ముంబైలోనే లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఆమెను మందలించారు. 

దీంతో ప్రియుడు అఫ్తాబ్ అమీన్‌తో కలిసి శ్రద్ధా ఢిల్లీకి వచ్చేసింది. తన కూతురు మెహ్రౌలీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో నివసిస్తుందని తండ్రి తెలుసుకున్నాడు. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్‌ని సందర్శించేందుకు వెళ్లినట్లు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటో ద్వారా అతనికి తెలిసింది. అయితే 
కూతురుకు సంబంధించి ఎలాంటి ఫొటోలు గానీ.. సమాచారం తెలియలేదు. ఫోన్ నంబర్‌లో కూడా సంప్రదించడానికి ప్రయత్నించగా.. అప్పటికే స్విచ్‌ ఆఫ్ చేసి ఉంది. 

ఆందోళన చెంది గతేడాది ఛతర్‌పూర్‌కు వెళ్లి కూతురు నివాసం ఉంటున్న ప్లాట్‌కు వెళ్లి చెక్ చేశాడు. అక్కడ ఎవరూ కనిపించలేదు. దీంతో మెహ్రౌలీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కూతురును అఫ్తాబ్ అమీన్ పూనావల్లా అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు కంప్లైంట్ ఇచ్చాడు. 

ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. అఫ్తాబ్ అమీన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పెళ్లి చేసుకోమని శ్రద్ధా తరచూ ఒత్తిడి చేసేదని.. దీంతో ఇద్దరి మధ్య గొడవలు వచ్చేవని చెప్పాడు. మే 18న గొడవ జరిగి శ్రద్ధను గొంతుకోసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని రంపంతో 35 ముక్కలుగా నరికి మూడు వేర్వేరు చోట్ల పడేసినట్లు తెలిపాడు. 

శ్రద్ధాను గొంతుకోసి హత్య చేసిన అఫ్తాబ్ రంపంతో 35 ముక్కలుగా కోసి తన ఇంట్లో ఉంచుకున్నాడని పోలీసులు తెలిపారు. కొత్త పెద్ద ఫ్రిజ్ కొని 18 రోజులు ఇంట్లో ఉంచాడని చెప్పారు. రాత్రి 2 గంటల సమయంలో మృతదేహం ముక్కలను ఒక్కొక్కటిగా ప్లాస్టిక్ సంచిలో తీసుకుని విసిరేసేవాడని వెల్లడించారు. నిందితుడి వాంగ్మూలం ఆధారంగా పోలీసు బృందం శ్రద్దా మృతదేహం ముక్కలను కనుగొనే పనిలో ఉన్నారు. కూతురి మరణవార్త తెలుసుకుని తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

Also Read: YSRCP: మంగళగిరిలో వైసీపీకి ఎదురుదెబ్బ.. ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు టీడీపీలోకి జంప్‌  

Also Read: CM KCR: కేటీఆర్‌కు సీఎం పగ్గాలా..? అసెంబ్లీ రద్దా..? కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News