Man Chops breasts: మహిళతో ఇల్లీగల్ అఫైర్.. దూరం పెట్టిందని రొమ్ములు కోసేశాడు!

Man Chops His Ex Lover's breasts: ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌లాగే బీహార్‌కు చెందిన నీలం దేవి కూడా దారుణ హత్యకీ గురైంది, ఒకప్పుడు సన్నిహితంగా మెలిగిన వ్యక్తిని దూరం పెట్టడంతో అతను ఇలా చేశాడని అంటున్నారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Dec 5, 2022, 06:30 PM IST
Man Chops breasts: మహిళతో ఇల్లీగల్ అఫైర్.. దూరం పెట్టిందని రొమ్ములు కోసేశాడు!

Man Chops His Ex Lover's breasts in crowded market: బీహార్‌కు చెందిన నీలం దేవి దాదాపు ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్‌లాగే దారుణంగా హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన షకీల్ తన సహచరుడితో కలిసి ఆమె చేతులు, చెవులు, రొమ్ములు నరికేశాడు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే పిరపైంటి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఛోటీ దిలౌరి నివాసి అశోక్ యాదవ్ భార్య నీలం దేవి (42) శనివారం దారుణ హత్యకు గురైంది.

ఆమెను మహ్మద్ షకీల్‌ హత్య చేశాడని తెలుస్తోంది. నిజానికి వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారని, కుటుంబ ఒత్తిడి కారణంగా నీలం అతన్ని దూరం పెట్టడంతో షకీల్ ఆమెను చంపాలని ప్లాన్ చేసి ఉండవచ్చని అంటున్నారు. ఛోటీ దిలౌరిలో ఉన్న గ్రామానికి వెళ్లే దారిలో నీలంని ఆపి, బలవంతంగా ముందుగా చేతులు, రొమ్ములు, చెవులు కోసి, ఆపై శరీరంలోని అనేక భాగాలపై తీవ్రమైన గాయాలు చేసి, షకీల్ అక్కడి నుంచి  పారిపోయాడని అంటున్నారు.

నీలమ్ పరిస్థితి విషమంగా ఉన్నందున మొదట పిర్పైంటి హాస్పిటల్‌కు రిఫర్ చేయబడ్డారు, ఆపై పరిస్థితి మరింత దిగజారడంతో, ఆమెను భాగల్పూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ అధిక రక్తస్రావం కావడంతో పరిస్థితి విషమించి మృతి చెందింది. మరోవైపు షకీల్‌ను పట్టుకునేందుకు పీర్‌పైంటి పోలీస్‌స్టేషన్‌ చీఫ్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పోలీసు బృందం పీరపైంటి బజార్‌, షెర్మారీ, రాజ్‌గంజ్‌ తదితర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్లు చేస్తోంది. 

పొలాల సరిహద్దు

నీలం, షకీల్‌ పొలాల సరిహద్దు ఒకే చోట ఉందని పిర్‌పైంటి పోలీస్‌ స్టేషన్‌ చీఫ్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. అందుకే షకీల్ నీలమ్ ఇంటికి వచ్చేవాడని, ఈ సమయంలో ఇద్దరూ చాలా సన్నిహితంగా మెలిగేవారని, వీరిద్దరి సాన్నిహిత్యం కారణంగా నీలం కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు నీలంను మందలించడంతో ఆమె మారిందని అంటున్నారు. షకీల్‌ను కూడా హెచ్చరించి ఇంటికి రానివ్వలేదని, అయినా షకీల్ నీలమ్‌ను విసిగిస్తూనే ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. 
 

దీంతో ఆమెను చంపాలని భావించి పదునైన ఆయుధంతో కొట్టి చేతులు, చెవులు, రొమ్ములను నరికేశాడని అంటున్నారు. ఇక'షకీల్‌తో మాకు శత్రుత్వం లేదు, ఈ సంఘటన అర్థం చేసుకోలేనిదని మృతురాలి భర్త అశోక్ యాదవ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ నా భార్య నీలం దేవి శనివారం సాయంత్రం మార్కెట్‌కు వెళ్లింది, ఆ సమయంలో ఈ ఘటన జరిగింది. షకీల్‌తో మాకు ఇంతకు ముందు ఎలాంటి శత్రుత్వం లేదు, కానీ ఈ రకమైన సంఘటన నాకు అర్థం కాలేదు. నా భార్య రోజూ ఆటోలో ఇంటికి వచ్చేదని, అయితే శనివారం సాయంత్రం కాలినడకన వస్తోందని మృతురాలి భర్త అశోక్ యాదవ్ తెలిపారు. 

Also Read: Old City Fake Baba: ఫేక్ బాబా ఫోన్‌లో వందలాది మంది మహిళల న్యూడ్ ఫొటోలు.. ఫిజిక్‌ను బట్టి రేటు ఫిక్స్  

Also Read: Byreddy Siddharth Reddy: బైరెడ్డి పవర్‌పుల్ స్పీచ్.. మధ్యలో అస్వస్థత.. కార్యకర్తల్లో ఆందోళన  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 
 

Trending News